కోర్టు చౌరస్తా, నవంబర్ 26: అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి అందరికీ సమాన అవకాశాలు కల్పించారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జడ్జి ఎంజీ ప్రియదర్శిని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురసరించుకొని శుక్రవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాజ్యాంగ దిక్సూచి ప్రకారం అందరం నడవాల్సి ఉందని తెలిపారు. అలాగే, వరకట్న నిషేధంపై పారా లీగల్ వలంటీర్లు గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారని పేర్కొన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి భవానీచంద్ర మాట్లాడుతూ, పేదలకు ఉచిత న్యాయం, న్యాయ సహాయం లాంటివి రాజ్యాంగం తెలిపినవేనని, అందరూ హకులతో పాటు బాధ్యతలను కూడా గుర్తుంచుకోవాలని సూచించారు. అడిషనల్ డీసీపీ చంద్రమోహన్ మాట్లాడుతూ, ప్రపంచ దేశాలు మెచ్చుకునేది మన రాజ్యాంగాన్ని అని, ప్రజల హకులను కాపాడేది రాజ్యాంగం అని అన్నారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జూపల్లి సత్యనారాయణ రావు మాట్లాడుతూ, రాజ్యాంగంలోని చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి సుజయ్ మాట్లాడుతూ, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేదర్ కృషిని స్మరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర న్యాయమూర్తులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, పోలీసు సిబ్బంది, ఎన్జీవోలు తదితరులు పాల్గొన్నారు.