మెట్పల్లి, డిసెంబర్10: వానలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం, కొత్తగా అభివృద్ధి పనుల కోసం పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖల నుంచి కోరుట్ల నియోజకవర్గానికి రూ.26.98 కోట్లు మంజూరైనట్లు కోరుట్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిధులు మంజూరు వివరాలను వెల్లడించారు. అదే విధంగా రోడ్లు, భవనాల శాఖ నుంచి రూ. 12.15 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖ నుంచి రూ.14.83 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రోడ్లు, భవనాల శాఖ నిధుల నుంచి వర్షకొండ-మూలరాంపూర్ మధ్య వంతెనకు రూ.1.95 కోట్లు, కోరుట్ల నుంచి రాయికల్ రోడ్డుకు రూ.87 లక్షలు, కోరుట్ల నుంచి మల్లాపూర్ రోడ్డుకు రూ.1.50 కోట్లు, రాఘవపేట బైపాస్ రోడ్డు, కుస్తాపూర్ బైపాస్ రోడ్డుకు రూ.35 లక్షలు ,బట్టాపూర్-గోదూర్ రోడ్డులో కల్వర్టులకు రూ.82 లక్షలు, హైలెవల్ వంతెనకు రూ.2.65 కోట్లు, వర్షకొండ-మూలరాంపూర్ మధ్య హైలెవల్ వంతెనకు రూ.2.50 కోట్లు, యూసుఫ్నగర్ కల్వర్టులకు రూ.80 లక్షలు, కోరుట్ల నుంచి మల్లాపూర్ రోడ్డులో కల్వర్టుకు రూ.68 లక్షలు కేటాయించారు.
అదే విధంగా పంచాయతీ రాజ్ నిధులు తిమ్మాపూర్ నుంచి రాఘవపేటకు రూ.1.09 కోట్లు, కొండ్రికర్ల నుంచి జగ్గాసాగర్కు రూ.47 లక్షలు, పెద్దాపూర్ నుంచి 63వ జాతీయ రహదారి వరకు రూ.34 లక్షలు, కోరుట్ల వాగు జంబిగద్దె నుంచి నాగులపేట మీదుగా సంగెం వరకు రూ.64 లక్షలు, చిట్టాపూర్ నుంచి రాఘవపేట వరకు రూ.65 లక్షలు, చౌలమద్ది నుంచి వెల్లుల వరకు రూ.49 లక్షలు, రాంలచ్చక్కపేట నుంచి ఏఎస్సార్ తండా వరకు రూ.1.53 కోట్లు, వెల్లుల్ల నుంచి మాసాయిపేట వరకు రూ.62 లక్షలు, గోదూర్ నుంచి ముత్యంపేట మధ్య రహదారికి రూ.1.05 కోట్లు, మొగిలిపేట నుంచి మల్లాపూర్ వరకు రూ.1.10 కోట్లు, జగ్గాసాగర్ నుంచి బండలింగాపూర్ వరకు రూ. 15 లక్షలు, డబ్బా నుంచి వర్షకొండ వరకు రూ.1.48 కోట్లు, ఫకీర్కొండాపూర్ నుంచి నడికుడ వరకు రూ.71 లక్షలు, ఇబ్రహీంపట్నం నుంచి కోమటికొండాపూర్ వరకు రూ.74 లక్షలు, తిమ్మయ్యపల్లె నుంచి అయిలాపూర్ వరకు రూ.9 లక్షలు, ధర్మారం నుంచి కల్లూర్ వరకు రూ.17 లక్షలు, కోరుట్ల జంబిగద్దె నుంచి సంగెం మధ్య రోడ్డు వంతెన నిర్మాణం కోసం రూ.51 లక్షలు, సిరిపూర్ నుంచి నడికుడకు రూ.60 లక్షలు, గుండంపల్లి నుంచి మల్లాపూర్కు రూ.60 లక్షలు, రేగుంట నుంచి వేంపల్లికి రూ.60 లక్షలు, మల్లాపూర్ నుంచి గొర్రెపల్లికి రూ.60 లక్షలు, సంగెం నుంచి మల్లాపూర్ వరకు రహదారి అభివృద్ధికి రూ.60 లక్షలు కేటాయించారు.
పేదల వైద్యానికి సీఎం సహాయ నిధి భరోసానిస్తున్నదని కోరుట్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. ఇటీవల ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందిన పట్టణానికి చెందిన జావిద్కు మంజూరైన రూ. 2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే మెట్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని పేద,మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మర్కజి ఇంతెజామి కమిటీ అధ్యక్షుడు కుతుబొద్దీన్పాషా, నాయకుడు ఎండీ షాకీర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు గంగాధర్, నాయకులు సాధక్, సమీర్ పాల్గొన్నారు.
మెట్పల్లి పట్టణ మర్కజి ఇంతెజామి కమిటీ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన కుతుబొద్దీన్ పాషా శనివారం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావును మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించారు. కుతుడొదీన్పాషాను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ షాకీర్సిద్ధిఖ్, సాధక్, మార్గం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.