చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్
కొదురుపాకలో 12 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
బోయినపల్లి, డిసెంబర్ 25: పేద ప్రజలకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. కొదురుపాక రైతు వేదికలో కొదురుపాక, నీలోజిపల్లి, వెంకట్రావ్పల్లి, మాన్వాడ, విలాసాగర్, రత్నంపేట గ్రామాలకు చెందిన 12 మంది లబ్ధిదారులకు రూ.8 లక్షల 72 వేల 800 సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావుతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. కొదురుపాక రైతు వేదిక ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా సీఎంఆర్ఎఫ్ సాయం మంజూరుకు కృషి చేసిన జోగినపల్లి రవీందర్రావుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, మాజీ జడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, వెంకట్రావ్పల్లి సర్పంచ్ బూర్గుల నందయ్య, కొదురుపాక ఉప సర్పంచ్ రవిచందర్, టీఆర్ఎస్ నాయకులు జూలపల్లి అంజన్రావు, కొండం నారాయణరెడ్డి, ఒజ్జల మహేందర్, దేవయ్య, కత్తెరపాక శ్రీనివాస్, ఎడపల్లి బాబులున్నారు.