కుల వృత్తులకు జీవం పోసిన సీఎం కేసీఆర్
నాయీబ్రాహ్మణ కల్యాణ మండపానికి రూ. 20 లక్షలు కేటాయింపు
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్
కార్పొరేషన్/తెలంగాణచౌక్, జనవరి 25: తెలంగాణలో అన్నికులాల వారు ఆత్మ గౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున 42 కులాలకు ఆత్మ గౌరవ భవనాలు నిర్మిస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేరొన్నారు. తీగలగుట్టపల్లిలో మంగళవారం జిల్లా, నగర నాయీబ్రాహ్మణ సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిచారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కులవృత్తులకు జీవం పోశారని కొనియాడారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే హైదరాబాద్లోని కోకాపేటలో 42 కుల సంఘాలకు 81 ఎకరాల స్థలం ఇవ్వడంతో పాటు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి రూ. 95 కోట్లు కేటాయించారని పేరొన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యనందించాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 281 గురుకులాలను స్థాపించారని తెలిపారు. నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నాయీబ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తున్నామని పేరొన్నారు. తీగలగుట్టపల్లిలో నిర్మిస్తున్న నాయీ బ్రాహ్మణ కల్యాణ మండపానికి రూ. 20 లక్షలు కేటాయిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆరు నెలల్లో ఈ భవనాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కాశెట్టి లావణ్య-శ్రీనివాస్, బండారి వేణు, టీఆర్ఎస్ నాయకులు చల్ల హరిశంకర్, నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వాయి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుల నీలం మొండయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పగడల జయరామ్, నగర అధ్యక్షుడు జంపాల సంపత్, ప్రధాన కార్యదర్శి కంది వెంకటేశ్ పాల్గొన్నారు.
నవ సమాజ నిర్మాణంలో ఓటు దోహదం
కొత్తపల్లి, జనవరి 25: నవ సమాజ నిర్మాణంలో ఓటు దోహదపడుతుందని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురసరించుకొని తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో జడ్పీ కార్యాలయ ఆవరణలో ‘ఓటు హకు-యువత హకు’ నినాదంతో ముద్రించిన పోస్టర్ను ఆయన ఆవిషరించారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, యువజన, స్వచ్ఛంద, మహిళా సంఘాలు ఓటు హకు ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉందని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హకు కీలకమైందని, యువత ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, తెలంగాణ యువజన సమితి చైర్మన్ చల్ల హరిశంకర్, అధ్యక్షుడు సత్తినేని శ్రీనివాస్, కార్యదర్శి శోభారాణి, సుస్మిత, మేము సైతం యువసేన అధ్యక్షురాలు చకిలం స్వప్న, శ్రావణ్, మహేశ్, యువజన, స్వచ్ఛంద, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.