ఎమ్మెల్యే డాకర్ట్ సంజయ్కుమార్
హబ్సీపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
జగిత్యాల రూరల్, నవంబర్ 24: అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన సాగుతున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలం హబ్సీపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని బుధవారం ఎమ్మె ల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మి, ఉప సర్పంచ్ రమేశ్, దళిత సంఘం గ్రామాధ్యక్షుడు బక్కయ్య, అంబేద్కర్ సంఘం యూత్ అధ్యక్షుడు శేఖర్, సభ్యులు సునీల్, బాబు, అనిల్, గంగాధర్, గంగన్న, సర్పంచులు అరుణ, అంజిరెడ్డి, మల్లన్న, మల్లయ్య, జైపాల్ రెడ్డి, మహేశ్వర్ రావు, జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మెంబర్ దుమాల రాజ్కుమార్, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు అంజి, సారంగాపూర్ వైస్ ఎంపీపీ సురేందర్, నాయకులు మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఎల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తిరుపతి గౌడ్, కొండ ప్రభాకర్, వంశీ తదితరులు పాల్గొన్నారు.