బీజేపీ మతతత్వ పార్టీ
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే వాళ్లకు పడదు
టీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ..
అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్పెద్దపీట వేస్తున్నడు
మరోసారి టీఆర్ఎస్కే ఓటేయాలి..
మంత్రి కొప్పుల ఈశ్వర్
జమ్మికుంటలో ప్రచారం
జమ్మికుంట, అక్టోబర్ 24: ‘బీజేపీ మతతత్వ పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే ఆ పార్టీకి పడదు. పూర్తిగా వ్యతిరేకం. ఆ పార్టీని నమ్మి ఓటేస్తే నష్టపోతరు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అంటూ మంత్రి హరీశ్రావు హుజూరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘టీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ. అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నది. సీఎం కేసీఆర్ అన్ని కుల, మతాలకు సముచిత స్థానం అందిస్తున్నడు. సంక్షేమంలో అందరికీ పెద్దపీట వేస్తున్నడు. ప్రశాంతమైన వాతావరణంలో పాలన సాగుతోంది. మరోసారి టీఆర్ఎస్కే ఓటేయ్యాలే. ఉద్యమ నాయకుడు, గరీబు బిడ్డ గెల్లు సీనును గెలిపించుకోవాలే. హుజూరాబాద్ మరింత అభివృద్ధిని సాధించాలి.’ అని పేర్కొన్నారు. ఆదివారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 17, 21వ వార్డుల్లో పర్యటించారు. ఇంటింటికీ తిరిగారు. అలాగే 21వ వార్డు మెయిన్ రోడ్డులోని షాపుల్లోని నిర్వాహకులను కలిశారు. నమూనా ఈవీఎంను పంపిణీ చేశారు. అందులోని కారు గుర్తును చూపారు. ఈ నెల 30న జరిగే పోలింగ్లో కారు గుర్తు గెల్లు శ్రీనివాస్ యాదవ్కే ఓటేయ్యాలని అభ్యర్థించారు. తర్వాత 17వ వార్డులోని తిరిగారు. ఈ సందర్భంగా కాలనీలోని క్రిస్టియన్లు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. టీఆర్ఎస్కే ఓటేస్తామని చెప్పారు. ప్రచారంలో భాగంగా ఆయా కాలనీల్లో స్థానిక ప్రజలతో మంత్రి ముచ్చటించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద దాడులు, హ త్యలు చేస్తున్నదని ఆరోపించారు. నల్ల చట్టాలు రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతులపై కార్లెక్కించి చంపేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పార్టీలో చేరిన ఈటల రేపు ప్రతిపక్ష ఎ మ్మెల్యేగా ఏం చేస్తడని ప్రశ్నించారు. నిరుపేదల కోసం ఒక్క ఇళ్లు నిర్మించలేని సోయిలేని ఈటల, ఇక్కడ స్థానం లేకుండా చేయాలని కోరారు.టీఆర్ఎస్ ఒక్కటే రాష్ర్టానికి శ్రీరామరక్షని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పండుగలకు బట్టల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గడిచిన ఐదు నెలల్లో జమ్మికుంటకు 60కోట్లు సీఎం ఇచ్చారని, అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని పేర్కొన్నారు. సంక్షేమం.. అభివృద్ధి ఇదే విధంగా సాగాలంటే కారు గుర్తుకు ఓటేసి గెల్లును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తమ భద్రత, సంక్షేమానికి సముచిత స్థానం కల్పిస్తున్న సీఎం కేసీఆర్ వెంటే నడుస్తామని మంత్రితో.. క్రిస్టియన్లు, కాలనీవాసులు, షాపుల యజమానులు తెలిపారు. మంత్రితో పాటు మున్సిపల్ చై ర్మన్ రాజేశ్వర్రావు, ఆయా వార్డులకు చెందిన కౌన్సిలర్లు మల్లయ్య, శ్రీనివాస్, టీఆర్ఎస్ అర్బన్శాఖ అధ్యక్షుడు రాజ్కుమార్, పాస్టర్లు ఆనందయ్య, అశోక్, నాయకులు ఉన్నారు.