కార్మిక క్షేత్రంలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్
మంత్రి కేటీఆర్ చొరవతో ఏర్పాటు దిశగా అడుగులు
త్వరలోనే పనులు ప్రారంభం
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): కార్మిక వాడల్లోని డైయింగ్, సైజింగ్ పరిశ్రమలతో పాటు నివాసాల నుంచి వచ్చే మురుగు నీటి శుద్ధిపై సిరిసిల్ల మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది. దినదినం విస్తరిస్తున్న జిల్లా కేంద్రంలో పెరుగుతున్న పరిశ్రమల ద్వారా వస్తున్న మురుగునీరు చేరికతో మానేరు వాగు కలుషితమవుతున్న ది. శాంతినగర్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వెనుకాల గల డబుల్బెడ్రూం ఇండ్ల పక్కన దామెరకుంట, తుమ్మలకుం ట మధ్యన నీరు చేరుతుంది. ఆప్రాంతంలోని పంట చేలతో పాటు మానేరు వాగులోని నీరు కలుషితమవు న్నది. ఈ సమస్యకు పరిష్కారం చూపాల ని స్థానికులు అమాత్యుడికి మొరపెట్టుకోగా ఆయన సానుకూలంగా స్పందించారు.
అమాత్యుడి ఆదేశాలు..
జిల్లా కేంద్రంలో దాదాపు మూడు వందల అద్దకం పరిశ్రమలు ఉన్నాయి. 30వేల మరమగ్గాలు, 15 సైజింగ్ ల వరకు ఉన్నాయి. వీటితో పాటు సుమారు లక్ష జనాభా గల పట్టణంలోని నివాసాల నుంచి రోజుకు 13నుంచి 15 ఎంఎల్డీల మురుగు నీరు దామెరకుంట, తుమ్మలకుంట చెరువులోకి వస్తుంది. ఈనీరు చెరువులో నుంచి పక్కనే ఉన్న మానేరులో కలువడంతో వాగు నీరు కలుషితమ వుతుంది. దీనిపై ప్రజలంతా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. వెంటనే సీవరేజ్ ట్రీట్మెం ట్ ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిం చాలని ఇంజినీరింగ్ అధికారుల ను ఆదేశించారు. దీంతో అధికారులు అంచనాలు తయా రు చేసి ప్రభుత్వానికి నివేదించారు.
రూ. 61.25 కోట్లతో అంచనాలు..
సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్లోని దామెరకుంట, తుమ్మలకుంట మధ్యన రూ. 61.20 కోట్లతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించాలని బల్దియా నిర్ణయించింది. ప్రస్తుత జనాభాతో పాటు మరో పదిహేనేళ్ల ముందు చూపుతో ప్లాంట్ నిర్మించాలని తలంచింది. మంత్రి కేటీఆ ర్ ఆదేశాల మేరకు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించింది. ప్లాంట్ నిర్మాణానికి 11 ఎకరాల స్థలం అవసరమని నివేదికలో పేర్కొన్నది. ్రప్రస్తుతం 5 ఎకరాల స్థలం అందుబాటులో ఉండగా, మరో 6 ఎకరాల స్థలం ప్రైవేటు యజమానుల నుంచి సేకరించనున్నారు. రోజుకు 19.01ఎంఎల్డీల మురుగు నీరు శుద్ధి చేసే విధంగా ప్లాంట్ నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నిధులు కూడా అందుబాటులో ఉండడంతో ఇప్పటికే టెండర్లు పిలిచింది.
ఎస్టీపీతో తీరనున్న ఇబ్బందులు ..
సీవరేజ్ ప్లాంట్ నిర్మాణంతో కార్మిక క్షేత్ర ప్రజల ఇ బ్బందులు తీరనున్నాయి. రోజుకు 13 ఎంఎల్డీల మురు గు నీటిని శుద్ధి చేయనున్నారు. 19.1 ఎంఎల్డీ సామర్థ్యం గల ప్లాంట్ను నిర్మించనున్నారు. ప్లాంట్లో శుద్ధి చేసిన నీటిని హరిత హారంలో నాటిన మొక్కలు, చెట్లకు వివిధ అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటి కే డంప్యార్డులో మానవ వ్యర్థాల శుద్ధి ప్లాంట్ను నెలకొ ల్పారు. దీని ద్వారా తయారైన ఎరువును నర్సరీలో పెంచుతున్న మొక్కలకు వినియోగిస్తున్నారు. నిర్మించను న్న ప్లాంట్ ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యత నిర్మించిన కాంట్రాక్టర్దే ఉండేలా ఒప్పందం మేరకు ప్రణాళికలు రూ పొందించారు. వాన్షకాలంలో మురుగు నీరు బైపాస్ రోడ్డులోని ప్రైవేటు యజమానుల స్థలాల్లోకి చేరి చెరువును తలపిస్తున్నది. ఇది అందరికి ఇబ్బందికరంగా మారడంతో బల్దియా సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ నిర్మించేందుకు చర్యలు తీసుకున్నది. నెలరోజుల్లో పనులు ప్రారంభించేం దుకు సన్నాహాలు చేస్తున్నది.
స్థలాన్ని ఎంపిక చేశాం..
సిరిసిల్ల పట్టణంలో మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి అన్ని చర్యలు చేపట్టాం. మంత్రి కేటీఆర్ చొరవతో ఇప్పటికే అనుమతులు లభించాయి. 11 ఎకరాల స్థలం అవసరం కాగా, అయిదు ఎకరాల స్థలం అందుబాటులో ఉన్నది. మరో 6 ఎకరాల స్థలం కొనుగోలు చేయాల్సి ఉన్నది. మరో 15ఏళ్ల అవసరాలకు సరిపోయేలా ప్లాంట్ నిర్మించాలన్నది ఆలోచన. రూ. 61.25 కోట్లు అవసరం. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం.
-జిందం కళ, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్