ఈటల మాటలను ఎవరూ నమ్మొద్దు
పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండండి
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
ఇంద్రనగర్లో బుడగజంగాల ఆత్మీయ సమ్మేళనం
జమ్మికుంటలోని 4, 19వ వార్డుల్లో ప్రచారం
జమ్మికుంట రూరల్, అక్టోబర్ 21: తన స్వార్థం కోసమే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. హుజూరాబాద్ మండలంలోని ఇంద్రనగర్ ఫంక్షన్హాల్లో మహిళలతో నిర్వహించిన సమావేశానికి, పట్టణ పరిధిలోని మారుతీనగర్లో నిర్వహించిన బుడగ జంగాల ఆత్మీయ సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. మహిళల కోసం కేసీఆర్ కిట్, ఉచిత విద్యాబోధన, కల్యాణలక్ష్మి, అమ్మ ఒడి, లక్షమంది ఒంటరి మహిళలకు పింఛన్లు అందిస్తున్న ట్లు చెప్పారు. సంచార జాతికి చెందిన బుడగ జంగాలు నిరుపేదలని, గతంలో ఏ ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ దళితబంధును వీరికి వర్తింపజేశారని తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీ గెలిపించాలని కోరారు. జడ్పీటీసీ సుధారాణి, కౌన్సిలర్ శ్రీలత, జమ్మికుంట సహకార సంఘం అధ్యక్షుడు పొనగంటి సంపత్, సీనియర్ సిటిజన్స్ ప్రెసిడెంట్ స్వామి, బుడగ జంగాల నాయకులు యాదగిరి, రాంకుమార్, లింగయ్య వెంకటేశ్, సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం నాయకుడు మల్లయ్య, మహిళా సంఘం నాయకులు సింధూరెడ్డి, మల్లీశ్వరి, పద్మజ తదితరులున్నారు.
నమూనా ఈవీఎంతో వినూత్న ప్రచారం
జమ్మికుంట పట్టణంలోని 4,29,30 వార్డుల్లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ సతీమణి శ్వేత ఇంటింటా ప్రచారం చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. మోడల్ ఈవీఎంతో ఓటర్లకు అవగాహన కల్పించారు. మంత్రి మాట్లాడుతూ.. కారును పోలిన గుర్తులతో జాగ్రత్తగా ఉండాలని, వృద్ధులు గందరగోళానికి గురికావద్దని సూచించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లల్లి రాజేశ్వర్రావు, వార్డు కౌన్సిలర్లు ఎలగందుల స్వరూప-శ్రీహరి, మద్ది లావణ్య, రావికంటి రాజు, నాయకులు తిరుపతి, అహ్మద్, సలీం, మొగిలి, వీరన్న, కిషన్, సురేశ్, శ్రీనివాస్, శంకర్, సత్యనారాయణ, మల్లయ్య, శ్రీనివాస్రావు, శ్రీనివాస్, రాకేశ్ తదితరులున్నారు.
19వ వార్డులో గడపగడపా తిరుగుతూ..
పట్టణ పరిధిలోని 19వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న-కోటి ఆధ్వర్యంలో గడపగడపా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అధికసంఖ్యలో మహిళలు టీఆర్ఎస్కు మద్దతు పలికారు. మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ పొడేటి రామస్వామి, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్, నాయకులు వెంకటేశ్, దేవరాజ్, మాధవరావు, తిరుపతి, బాబురాజు తదితరులున్నారు.
ఊరూరా.. ఉధృతంగా
టీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. ఊరూరా ఉధృతంగా సాగుతున్నది. పార్టీ నాయకులు సహా క్యాడర్ అంతా ఊరూరా కలియదిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నది. బుధవారం జమ్మికుంట పట్టణంలోని 4,5,16,18, 19, 21 వార్డులతోపాటు బిజిగిరిషరీఫ్, నాగంపేట్ , మాచనపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు గురువారం ఇంటింటా ప్రచారం చేశారు. 5,18,19 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సతీమణి గెల్లు శ్వేత ఓట్లు అభ్యర్థించారు. ఇక మాజీ సర్పంచ్ పర్లపల్లి రమేశ్, ఉపసర్పంచ్ శ్రీకాంత్ నాయకుడు అశోక్ పట్టణంలోని షాపుల వద్ద మాచనపల్లి గ్రామకుల వృత్తి కార్మికులను కలిసి టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 16వవార్డులో వార్డు కౌన్సిలర్ కుతాడి రాజయ్య, 21వ వార్డులో టీఆర్ఎస్ నాయకులు, బిజిగిరిషరీప్, నాగంపేట్ గ్రామాల్లో సర్పంచులు సదయ్య, స్వాతి-కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పోడేటి రామస్వామి, ఎంపీటీసీ రాజయ్య, దళిత సంఘం నాయకుడు రాం చంద్రమౌళి గడపగడప తిరిగి ప్రచారం చేశారు.