యూనిట్ల గ్రౌండింగ్తో మారుతున్న బతుకులు
ఓనర్లవుతున్న డ్రైవర్లు, కూలీలు
తాజాగా మంత్రి గంగుల చేతుల మీదుగా రూ.2.60 కోట్ల ఆస్తుల పంపిణీ
దళిత బిడ్డల్లో ఆనందం
వెలుగులు నింపేందుకే.. : మంత్రి గంగుల
కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 21;నిలువనీడలేక..కడుపు నిండా తిండిలేక దగా పడ్డ అణగారిన వర్గాల్లో ‘దళితబంధు’ వెలుగులు నింపుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఈ పథకం దళితబిడ్డలకు భరోసానిస్తున్నది. ఇన్నాళ్లు అడ్డా కూలీలుగా, వాహన డ్రైవర్లుగా బతుకులు వెళ్లదీసిన వారికి దారి చూపుతున్నది. తాజాగా కరీంనగర్ అంబేదర్ స్టేడియంలో 24 మంది దళితబంధు లబ్ధిదారులకు రూ.2.60 కోట్ల విలువైన ఆరు హార్వెస్టర్లు,మూడు ఎక్స్కవేటర్లు, డీసీఎం వ్యాన్ను మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేయగా, లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. నచ్చిన, మెచ్చిన యూనిట్లను అందజేయడంతో ఉత్సాహం రెట్టింపవుతున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ‘దళితబంధు’ ఏండ్ల నాటి దారిద్రాన్ని దూరం చేస్తున్నది. ఏండ్లకేండ్లగా దగా పడ్డ దళిత బతుకులకు భరోసా ఇస్తున్నది. యూనిట్ల గ్రౌండింగ్ వేగంగా సాగుతుండగా, అంతటా సంబురం అంబరాన్నంటుతున్నది. తాజాగా కరీంనగర్ అంబేదర్ స్టేడియంలో 24 మంది దళితబంధు లబ్ధిదారులకు రూ.2.60 కోట్ల విలువైన ఆరు హార్వెస్టర్లు, మూడు ఎక్స్కవేటర్లు, డీసీఎం వ్యాన్ను మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేయగా, లబ్ధిదారులు ఆనందంలో మునిగితేలారు. కుటుంబసమేతంగా వచ్చి కేటాయించిన వాహనాలను తీసుకెళ్లారు. కొందరూ స్వయంగా నడుపుకుంటూ నవ్వులు చిందిస్తూ మురిపెంగా ఇండ్లకు వెళ్లారు. మంత్రి గంగుల సైతం లబ్ధిదారులను ఆప్యాయంగా పలుకరిస్తూ యూనిట్లను అందించారు. పలువురితో సరదాగా ముచ్చటించారు. కుశల ప్రశ్నలు వేశారు. అమ్మా బాగున్నారా..? బ్రదర్ ఎం సంగతి..వెహికిల్ మంచిగున్నదా..? అంటూ అడిగారు.
ఇన్నేండ్లు కూలీ చేసుకొని బతికినం..
ఇన్నేండ్లు వ్యవసాయ కూలీగా, ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసుకుంటూ బతుకులు ఎల్లదీసినం. ఇప్పుడు దళితబంధు కింద ఎక్స్కవేటర్ను తీసుకున్నం. మంత్రి గంగుల సారు తాళంచెవి అందిస్తుంటే మురిసిపోయినం. ఇది కలనా..నిజమా అనిపించింది. ఇగ ఇప్పటి నుంచి కష్టపడి పనిచేసుకొని మంచిగా బతుకుతం. మా పిల్లలను గూడా పెద్ద చదువులు చదివిత్తం. మా బాగు కోసం గింత మంచి పథకం తెచ్చిన ప్రభుత్వానికి రుణపడి ఉంటం. బతికినంత కాలం సీఎం సారును తలుసుకుంటం.