కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు దేశానికే ఆదర్శం
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
చొప్పదండి, జనవరి 21: అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మండలంలోని 38 మంది లబ్ధిదారులకు శుక్రవారం ఆయన రూ. 38,04,408 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వం తమదని, ఆ దిశగా పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. కరోనా సంక్షోభంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఆడబిడ్డల పెళ్లి చేసిన తల్లిదండ్రులు అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో కల్యాణలక్ష్మి సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కల్యాణలక్ష్మి ద్వారా వచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ ముద్దం మల్లేశం, తహసీల్దార్ రజిత, సర్పంచ్ గుంట రవి, కౌన్సిలర్ కొత్తూరి మహేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, నాయకులు బందారపు అజయ్కుమార్గౌడ్, మాచర్ల వినయ్, కొత్తూరి నరేశ్, మల్లేశం, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.