హుజూరాబాద్టౌన్, జనవరి 21: పుష్యమాస ఉత్తరాయణంలో వచ్చే మొదటి సంకష్టహర చతుర్థి సందర్భంగా లోక కల్యాణార్థం చెన్నూరి సురేశ్శర్మ ఆధ్వర్యంలో శుక్రవారం హుజూరాబాద్ పట్టణంలోని రాధాస్వామి సత్సంగ్లో శ్రీ మహాగణపతి లక్ష హవనం, అభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా అచల పురానికి చెందిన వేద పండితులు మల్లోజుల సందీప్శర్మ ఆధ్వర్యంలో 16 మంది వేద పండితులు ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహాగణపతి, బుద్ధి, సిద్ధిల ప్రతిమలకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. గణపతికి ఇష్టమైన లక్ష మోదుగులను హోమగుండంలో వేసి హవనం చేశారు. అనంతరం అభిషేకం, మహా ఆశీర్వచనాలను నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. లోక కల్యాణం కోసంపూజలు నిర్వహించినట్లు నిర్వాహకుడు సురేష్శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు రాంపల్లి రామకృష్ణశర్మ, జనార్ధనశర్మ, చంద్రశేఖరశర్మ, కృష్ణశర్మ, ప్రణీత్శర్మ, శ్రీకాంత్శర్మతోపాటు మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికా శ్రీనివాస్ దంపతులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
నగునూర్లో..
కరీంనగర్ రూరల్: జనవరి 21: సంకష్టహర చతుర్థి సందర్భంగా శుక్రవారం కరీంనగర్ మండలం నగునూర్ గ్రామంలో పరివార సమేత దుర్గాభవానీ దేవాలయంలో లక్ష్మీగణపతి పూజలు నిర్వహించారు. విశేష అభిషేకం, ఫల పంచామృతాభిషేకం, విశేష హారతి పూజా కార్యక్రమాలను అలయ అర్చకుడు పవనకృష్ణశర్మ నిర్వహించారు. ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, కార్పొరేటర్ వంగల శ్రీదేవి, పవన్కుమార్, ఆలయ కమిటీ బాధ్యులు వేములవాడ ద్రోణాచారి, నీరుమల్ల తిరుపతి, మధుసూదన్,భక్తులు పాల్గొన్నారు.
గోపాల్పూర్లో..
గోపాల్పూర్ గ్రామంలో స్వయం భూగణపతికి శుక్రవారం సంకష్టహర చతుర్థి సందర్భంగా అర్చకుడు ఇరుగురాళ్ల మధుసూదనాచార్యులు పూజలు నిర్వహించారు. వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, సాయిని తిరుపతి, భక్తులు పాల్గొన్నారు.