కోల్సిటీ, డిసెంబర్ 20: కళా భవన్ నిర్మాణానికి మళ్లీ టెండర్లు పిలిచి పనులు త్వరితగతిన పూర్తి చేసి కళాకారులకు కానుకగా ఇస్తానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హామీ ఇచ్చారు. గోదావరి కళా సంఘాల సమాఖ్య 27వ వార్షికోత్సవం పురస్కరించుకొని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 28వ డివిజన్ హనుమాన్ నగర్లోని కళా భవన్ ప్రాంగణంలో ఆదివారం రాత్రి సకల కళా మహోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వేదికపై వివిధ ప్రాంతాల కళాకారులు భిన్న సంస్కృతులు ప్రతిబింబించేలా కళలను ప్రదర్శించారు. మేయర్ అనిల్కుమార్ మాట్లాడుతూ కళా భవన్ నిర్మాణానికి నగర పాలక సంస్థ తరఫున నిధులు కేటాయించి నూతన హంగులతో నిర్మిస్తామన్నారు. సమాఖ్య అధ్యక్షుడు కనకం రమణయ్య అధ్యక్షతన చేపట్టిన కార్యక్రమంలో కార్పొరేటర్ ఇంజపురి పులెందర్, సోగాల వెంకటి, తానిపర్తి గోపాల్ రావు, దయానంద్ గాంధీ, నాయకులు బొడ్డు రవీందర్, చక్రపాణి, రాజమౌళి, చంద్రపాల్, అంజలి, శారద, సురేశ్, సత్యం ఉన్నారు.
విద్యార్థినుల రక్షణకు చర్యలు
గోదావరిఖని, డిసెంబర్ 20: గోదావరిఖనిలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గోదావరిఖని రమేశ్నగర్లోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ బాలికలకు భరోసా కల్పించేందుకు ఎమ్మెల్యే హాస్టల్ను సందర్శించారు. దుండగులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కార్పొరేటర్లు పెంట రాజేశ్, కొమ్ము వేణు, పాముకుంట్ల భాస్కర్, బాల రాజ్కుమార్, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, బొడ్డు రవీందర్, నూతి తిరుపతి, మారుతి ఉన్నారు.
కల్యాణలక్ష్మితో భరోసా
జ్యోతినగర్, డిసెంబర్ 20: కల్యాణలక్ష్మి పేద ఆడబిడ్డలకు కొండంత భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రామగుండం 1,2, 20, 21,22,23 డివిజన్లలో లబ్ధిదారుల ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు సీఎం కేసీఆర్ ఫొటోను అందించారు. ఇక్కడ డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, కార్పొరేటర్లు సతీశ్కుమార్, ఎన్వీ రమణారెడ్డి, శ్రీనివాస్, నాయకులు కుమ్మరి శారద, సుద్దాల గోపాల్, సలీంబేగ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, దీటు బాలరాజ్, కలవేని మల్లేశం, శివరాత్రి గంగాధర్, మాడిశెట్టి రవి, కొమ్మరాజుల శ్రీను, తోకల కుమార్, రమేశ్, ఎండీ హుస్సేన్, సతీశ్, రెవెన్యూ సిబ్బంది అనిల్రెడ్డి ఉన్నారు.
ఎమ్మెల్యేకు వినతి
ఎన్టీపీసీ ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయానికి ఎన్టీపీసీ పరిధిలో భూమిని కేటాయించాలని ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ వినతిపత్రాన్ని అందజేసింది.