మంథని టౌన్, డిసెంబర్ 20: మంథని డివిజన్ పరిధిలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలకు చెందిన దివ్యాంగులకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన ఉపకరణాలను పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మంగళవారం పంపిణీ చేయనున్నారు. ఫిబ్రవరిలో నిర్వహించిన సదరన్ క్యాంపులో 80 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఈ ఉపకరణాలను అందజేయనున్నారు. 56 బ్యాటరీ ట్రైసైకిళ్లు, 40 వినికిడి యంత్రాలు, అంధుల కోసం 20 స్మార్ కేన్లు, మానసిక దివ్యాంగుల కోసం 20 ఎంఎస్ఐఈడీలు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ ద్వారా మంజూరయ్యాయి. దీంతో పాటు డివిజన్లోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలకు చెందిన నలుగురు దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం 100శాతం సబ్సిడీతో కూడిన రూ. 50వేల విలువ చేసే చెక్కులు మంజూరు కాగా, వాటిని సైతం పంపిణీ చేయనున్నారు.