స్వచ్ఛ సర్వేక్షణ్లో సిరిసిల్ల బల్దియాకు చోటు
ఓడీఎఫ్ ప్లస్ప్లస్గా గుర్తింపు పాలకవర్గం హర్షం
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 20;అన్నింటా అభివృద్ధి పథంలో సాగుతున్న సిరిసిల్లకు మరోసారి జాతీయ ఖ్యాతి దక్కింది. కేంద్రం తాజాగా ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2020-21 ర్యాంకుల్లో చోటు దక్కించుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 9 మున్సిపాలిటీ లను ఎంపిక చేయగా ఇందులో సిరిసిల్ల ఒకటి కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 20మరుగుదొడ్ల ని ర్మాణం, పబ్లిక్, మొబైల్, షీ టాయిలెట్ల ఏర్పా టు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, పార్కులు, బస్టాండ్, మార్కెట్లలో మరుగుదొడ్ల నిర్వహణను పరిగణలోకి తీసుకొని కేంద్రం ర్యాంకులను ప్రకటించింది. కేంద్ర బృందం సభ్యులు ఐదు నెలల పాటు సిరిసిల్లలో పర్యటించి బల్ది యా పనితీరును పరిశీలించారు. సర్వే చేసి ప్ర జాభిప్రాయాన్ని క్రోడికరించారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని శుక్రవారం సిరిసిల్లకు జాతీయస్థాయి గుర్తింపును ప్రకటించారు.
ఓడీఎఫ్ ప్లస్ప్లస్గా సిరిసిల్ల
మరుగుదొడ్ల నిర్మాణం.. వంద శాతం వినియోగించడంలో సిరిసిల్ల మున్సిపాల్టీ అగ్రభాగాన నిలిచింది. బల్దియా పరిధిలో ఇంటింటా సెప్టిక్ ట్యాంకులతో కూడిన టాయిలెట్లను ని ర్మించారు. అంతేకాకుండా ప్రధాన చౌరస్తాల వద్ద మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేసిన వారికి జరిమానాలు విధించి కట్టడి చేసింది. మరుగుదొడ్ల వినియోగం, ఎఫ్ఎస్టీపీ నిర్వహణ ద్వారా మలవ్యర్థాల నుంచి ఎరువుల తయారీ, నిర్వహణను పకడ్బందీగా చేస్తున్నా రు. 2017లో నిర్వహించిన సర్వేలో ఓడీఎఫ్ ప్లస్ గుర్తింపును సాధించగా, 2021లో ఏకంగా ఓడీఎఫ్ప్లస్ప్లస్ గుర్తింపును దక్కించుకున్నది.
అందరి సహకారంతోనే..
పట్టణ ప్రజల సహకారంతోనే సిరిసిల్లకు స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో చోటు దక్కింది. మున్సిపల్ పరిధిలో ఇంటింటా మరుగుదొడ్లు నిర్మించినం. వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించినం. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రదేశాల్లో సామూహిక టాయిలెట్లు నిర్మించినం. రూ. 18లక్షలతో మొబైల్ షీ టాయిలెట్ను అందుబాటులోకి తెచ్చినం. ఈ నేపథ్యంలోనే సిరిసిల్లకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది.
-జిందం కళ, మున్సిపల్ చైర్పర్సన్
పకడ్బందీగా పనిచేసినం..
పట్టణంలోని 39 వార్డులలో వందశాతం సెప్టిక్ ట్యాంకులతో కూడిన మరుగుదొడ్లు నిర్మించినం. పట్టణ జనాభా ప్రాతిపదికన ప్రతి వెయ్యి మందికి ఒక టాయిలెట్ అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో 126చోట్ల టాయిలెట్లను ఏర్పాటు చేసినం. వీటి నుంచి వెలువడే వ్యర్థాలను ఎఫ్ఎస్టీపీ ద్వారా ఎరువులను తయారుచేస్తున్నం. పకడ్బందీ చర్యలతోనే సిరిసిల్లకు కేంద్రం గుర్తింపునిచ్చింది.
-వెల్దండి సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్