ఆగ్రా : ఉత్తరప్రదేశ్లో ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ముగ్గురు అభ్యర్థులు తమ విజయాన్ని కళ్లారా చూడకముందే కరోనా కాటేసింది. ఎన్నో రోజులుగా ఎన్నికల్లో విజయం కోసం అల్లాడిన వారు.. తీరా విజయం అందుకునే సమయానికి కానరాని లోకాలకు పయనమయ్యారు. ఒకరు ఓట్ల లెక్కింపుకు ఆరు రోజుల ముందు చనిపోగా.. మరొకరు మూడు రోజుల క్రితం, ఇంకొకరు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాకముందే కన్నుమూశారు.
ఆగ్రా జిల్లా పరిధిలోని ఖండౌలి బ్లాక్కు చెందిన కుబేర్పూర్ గ్రామ పంచాయతీకి పోటీ చేసిన జస్వీర్ సింగ్ 202 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ గ్రామ పంచాయతీ ఓట్లను సోమవారం లెక్కించారు. అయితే, అతను మూడు రోజుల ముందే విజయాన్ని చూడకుండా కన్నుమూశాడు. కరోనా సోకి చాలా రోజులు దవాఖానలో పోరాడి తుదిశ్వాస విడిచాడు.
అలాగే, ఫతేపూర్ సిక్రీకి చెందిన రసూల్పూర్ గ్రామ పంచాయతీ నుంచి బాబులాల్ ఫౌజీ విజయం సాధించాడు. ఇతను కూడా కరోనా కారణంగా వారం క్రితం మంచాన పడి ఆరు రోజుల క్రితం ఏప్రిల్ 25 న మరణించాడు. భారత సైన్యం నుంచి పదవీ విరమణ చేసిన బాబులాల్.. దక్షిణాచల్ విద్యుత్ విత్రాన్ నిగమ్కు చెందిన ఫతేపూర్ సిక్రీ విద్యుత్ కేంద్రంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేశారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో తన గ్రామం రసూల్పూర్ నుంచి బరిలో నిలిచారు.
ఇదేవిధంగా, ఖండౌలి బ్లాక్ నుంచి వార్డు సభ్యురాలిగా పోటీ చేసిన యాస్మిన్ షకీల్ కూడా ఎన్నికల్లో గెలుపును ఆస్వాదించకుండానే కన్నుమూసింది. రెండు రోజుల క్రితం కడుపులో నొప్పితో స్థానిక దవాఖానలో చేరింది. కాగా, ఆదివారం ఉదయం కౌంటింగ్కు ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు ఈమె తుదిశ్వాస విడిచింది. అయితే, యాస్మిన్ షకీల్ కరోనాకు గురవడం వల్లనే చనిపోయిందని గ్రామస్థులు చెప్తున్నారు.
లాక్డౌన్ విధించండి.. క్యాట్ సర్వేలో ప్రజలు
ఈ నెల 10 న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్న కేపీ ఒలి
చైనాపై వైఖరి మార్చుకున్న న్యూజిలాండ్
తన నిర్ణయాన్ని సమర్ధించుకున్న ఆస్ట్రేలియా ప్రధాని
మయన్మార్లో ఆర్మీ అణచివేత: సైన్యం కాల్పుల్లో 8 మంది మృతి
గ్లేసియర్స్ కరిగి ఏర్పడిన వేలాది సరస్సులు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఆన్లైన్లో 60 మంది వైద్యులు.. వివిధ భాషల్లో సేవలు
అద్వానీ రథయాత్ర కారకుడు ప్రమోద్ మహాజన్.. చరిత్రలో ఈరోజు
లాక్డౌన్ తరహా ఆంక్షలు పొడగించిన పంజాబ్ ప్రభుత్వం
ప్రపంచంలోని పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జి ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..