మేయర్ సునీల్రావు
పట్టణ ప్రగతి దృశ్యమాలిక ప్రదర్శన
సమీకృత మార్కెట్లకు స్థల పరిశీలన
కార్పొరేషన్, జనవరి 17: నగర పరిశుభ్రతలో వినూత్నమైన మార్పులు తెస్తున్నామని మేయర్ సునీల్రావు పేర్కొన్నారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్-2022లో భాగంగా సోమవారం కోర్టు చౌరస్తాలో నగర పరిశుభ్రత, ప్లాస్టిక్ నివారణ, తడి, పొడి చెత్త వేరుచేయడం తదితర అంశాలపై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో దృశ్యమాలిక ప్రదర్శనను కమిషనర్ సేవా ఇస్లావత్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయ ర్ మాట్లాడారు. మన నగరం, మన పరిశుభ్రత మన బాధ్యత అనే నినాదంతో ప్రతి ఒకరూ సాధ్యమైనంత వరకు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మన ఇంట్లో ఉత్పత్తయ్యే చెత్తను తడి, పొడిగా వేరు చేసి నగరపాలక సంస్థ కార్మికులకు అందించాలని కోరారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి రీ సైక్లింగ్కు ఉపయోగపడే వస్తువులనే వాడాలన్నారు. కార్పొరేటర్లు, సరిల్ల ప్రసాద్, ఈఈ రామన్, శానిటేషన్ సూపర్వైజర్ రాజమనోహార్, ఎస్ఐలు, జవాన్లు పాల్గొన్నారు.
మెరుగైన వసతులతో సమీకృత మార్కెట్లు
నగర ప్రజలకు అన్ని ఆహార పదార్థాలు ఒకే చోట లభించేలా సమీకృత మార్కెట్లను అందుబాటులోకి తీసుకువస్తున్నామని మేయర్ సునీల్రావు తెలిపారు. కమిషనర్ సేవా ఎస్లావత్తో కలిసి పద్మనగర్లోని పశుసంవర్ధక శాఖకు చెంది న, ఆర్టీసీ వరషాప్లో ఉన్న, కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న ఇరిగేషన్ శాఖ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూరగాయలు, మాం సం, పండ్లు ఒకేచోట లభించేలా నగరంలో 5-6 సమీకృత మారెట్లను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే వ్యవసాయ మారెట్ యార్డు ఆవరణలో రూ.5.80 కోట్లతో సమీకృత మారెట్ పనులు ప్రారంభించామన్నారు. మిగతా చోట్ల స్థలాలను ఎంపిక చేస్తున్నామన్నారు. కాశ్మీర్గడ్డ రైతుబజార్ను రెండంతస్తుల భవనంతో సమీకృత మారెట్గా ఆధునీకరిస్తామన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న ఇరిగేషన్ శాఖ స్థలంలో రూ.14 కోట్లతో చేపట్టనున్న మా ర్కెట్కు టెండర్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామన్నారు. పశుసంవర్ధక శాఖ, ఆర్టీసీ స్థలాల కోసం మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో అధికారులతో చర్చించి స్థల సేకరణ చేసి పనులను ప్రారంభిస్తామన్నారు. నాయకులు, ఎస్ఈ నాగమల్లేశ్వర్, ఈఈ రామన్, టౌన్ ప్లానింగ్ డీసీపీ సుభాష్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.