నగర మేయర్ సునీల్రావు
33,11వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ
కార్పొరేషన్, జనవరి 17: నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రణాళిక, ప్రాధాన్యతతో అభివృద్ధి పనులు చేపట్టి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని నగర మేయర్ వై.సునీల్రావు తెలిపారు. నగరంలోని 33, 11వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించారు. 33వ డివిజన్ భగత్నగర్లో ఓల్డ్ బచ్పన్ సూల్ వద్ద రూ.3.50 లక్షల నగరపాలక సంస్థ నిధులతో ఎస్డబ్ల్యూజీ డ్రైనేజీ పైపులైన్ పనులు, 11వ డివిజన్లోని గౌతమీనగర్ శివారు ప్రాంతంలో రూ.5 లక్షలతో చేపట్టిన డ్రైనేజీ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిషారం చూపేందుకు ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గౌతమీనగర్లోని ప్రతి గల్లీలో అభివృద్ధి పనులు చేపట్టి వసతులు కల్పించడమే నగరపాలక సంస్థ ధ్యేయమన్నారు. కొంత కాలంగా వానకాలం వచ్చిందంటే డ్యాం సీఫేజీ వాటర్తో గౌతమీనగర్, కట్టరాంపూర్, అలాపురి, కోతిరాంపూర్ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, సీఫేజీ వాటర్, స్టాంవాటర్ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిషారం లభిస్తుందన్నారు. స్మార్ట్సిటీ నిధుల నుంచి డ్యాం సీఫేజీ వాటర్ పెద్ద డ్రైనేజీ నిర్మాణం కోసం నిధులను కేటాయించి టెండర్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. పాలకవర్గం ఏర్పాటు తర్వాత స్మార్ట్సిటీ ప్రాజెక్ట్లో గౌతమీనగర్ నుంచి అంబేదర్ స్టేడియం వరకు స్మార్ట్రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. చివరి దశలో ఉన్న రోడ్డు పనులు సాంకేతిక కారణాలతో నిలిచిపోయాయన్నారు. ప్రస్తుతం మళ్లీ పనులు ప్రారంభిస్తామని, రెండు నెలల్లో కట్టరాంపూర్ రోడ్డును స్మార్ట్ రోడ్డుగా మార్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. గతంలో గౌతమీనగర్ ప్రాంతంలో వీధి దీపాల సమస్య తీవ్రంగా ఉండేదని, ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. డివిజన్లలో ప్రణాళికాబద్ధంగా ప్రాధాన్యంతో అభివృద్ధి పనులను చేపట్టి పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డులో గ్రీనరీ కోసం రహదారి వెంబడి, డివైడర్లలో మల్టీలెవల్ ప్లాంటేషన్ పనులు కూడా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. నగర వ్యాప్తంగా డివిజన్లలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఆహ్లాదం కోసం పారుల అభివృద్ధి, ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్లు, వాకింగ్ ట్రాక్ల నిర్మాణం తదితర ఎన్నో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. మున్ముందు ప్రజలు ఆశించిన మేరకు వసతులు కల్పించి నగరాన్ని సుందరంగా తయారు చేస్తామన్నారు. నగరపాలక సంస్థ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్ ఆకుల నర్మద, ఈఈ రామన్, డీఈ మసూద్ అలీ, ఏఈ గంగాధర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.