అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
ప్రజల నుంచి 62 అర్జీల స్వీకరణ
పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశం
హౌసింగ్బోర్డుకాలనీ, జనవరి 17: ప్రజా సమస్యల సత్వర పరిషారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 62 మంది బాధితుల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ఆమె స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించినట్లు తెలిపారు. రెవెన్యూ సమస్యలపై 41, మున్సిపల్కు సంబంధించి 3, పంచాయతీ శాఖకు 4, ఎస్సీ కార్పొరేషన్కు 3, వారధికి 4 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇతర శాఖలకు సంబంధించి 7 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వెంటనే పరిషరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్కుమార్, డీపీవో వీర బుచ్చయ్య, కలెక్టరేట్ ఏవో లక్ష్మీరెడ్డి, ల్యాండ్ సర్వే అధికారి అశోక్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, మత్స్యశాఖ ఏడీ రాజ నర్సయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్, అగ్నిమాపకశాఖ అధికారి వెంకన్న, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు వెంటనే పరిషరించాలి
‘డయల్ యువర్ కలెక్టర్’కు ప్రజలు తెలిపిన సమస్యలను వెంటనే పరిషరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రాలేని ప్రజలు తమ సమస్యల పరిషారానికి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు. వివిధ కార్యాలయాలకు సంబంధించి కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులకు వెంటనే కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని, కౌంటర్ ఫైల్ దాఖలు చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ‘డయల్ యువర్ కలెక్టర్’కు అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నారు. ఆర్డీవో ఆనంద్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, ల్యాండ్ సర్వే అధికారి అశోక్, మారెటింగ్ శాఖ డీడీ పద్మావతి, డీసీవో శ్రీమాల, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జువేరియా, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్, అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న పాల్గొన్నారు.