జగిత్యాల రూరల్, జనవరి 17: అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ సమప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ మాత్రమేనని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. పట్టణంలో వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇండ్లకు ఎమ్మెల్యే నేరుగా వెళ్లి చెకులను సోమవారం అందజేశారు. జగిత్యాల పట్టణంలోని లింగంపేట, బీట్ బజార్, గణేశ్నగర్, గాంధీనగర్, ఖిలాగడ్డ, గంజ్, సుతారిపేట్ ఏరియాల్లో 14 మందికి సుమారు రూ.7లక్షల 32వేల విలువ గల చెకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో సీఎం సహాయ నిధి మొత్తం ఆంధ్ర పాలకులకే దకేదని, కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే ప్రతి ఒక్కరికీ సాయం మంజూరవుతున్నదని పేర్కొన్నారు. లింగంపేట్ గ్రామాన్ని జగిత్యాల మున్సిపాలిటీలో కలిపి అభివృద్ధి చేస్తున్నామని, లింగం చెరువును అభివృద్ధి చేసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. చింతకుంట చెరువును మినీ ట్యాంక్బండ్గా మార్చి సుందరంగా తీర్చిదిద్దున్నట్లు చెప్పారు. శ్మశానవాటికను ఆధునీకరించి ఆహ్లాదంగా తీర్చిదిద్దామని, కొత్త బస్టాండ్ నుంచి మంచినీళ్ల బావి వరకు డివైడర్లు ఏర్పాటు చేసి పచ్చని మొక్కలు నాటామని, దీంతో ప్రమాదాలు తగ్గాయని వివరించారు.
లక్షా 25 వేల మీటర్ల మంచినీటి పైపులైన్లు వేస్తున్నామని, రాబోయే తరాలకు మంచినీటి సమస్య రాకుండా ముందుకుసాగుతున్నామని చెప్పారు. సీఎం సహాయ నిధి కింద ఇప్పటి వరకు 3,400 మందికి దాదాపు రూ.30 కోట్ల వరకు సాయం అందించామని వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు లబ్ధిదారుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్రావు, కౌన్సిలర్లు భారతి రాజన్న, పంబాల రామ్ కుమార్, పిట్ట ధర్మరాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ మోసిన్, కో ఆప్షన్ మెంబర్ రియాజ్, బీసీ సెల్ పట్టణాధ్యక్షుడు లవంగ రాజేందర్, పట్టణ ఉపాధ్యక్షుడు దుమాల రాజ్ కుమార్, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, అమీన్, బెజ్జంకి లక్ష్మణ్, ముకీం, ఏఎంసీ డైరెక్టర్ విజయ్, మేక పవన్, జంగిలి రాజేశ్, ఫిరోజ్, ఫయాజ్, ఇతేమద్ ఉల్ హక్, జమీల్, నరేశ్, చిరంజీవి, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్, నర్సయ్య, మహేశ్, డాన్ శ్రీను, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.
రూ.1.50 లక్షల ఎల్వోసీ అందజేత
జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లికి చెందిన కొలగాని శ్రీనివాస్ అనే డ్రైవర్ కాలికి శస్త్ర చికిత్స నిమిత్తం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ విషయాన్ని అల్లీపూర్ టీఆర్ఎస్ నాయకులు ఎంబారి వెంకటేశ్, మహేశ్కు తెలుపగా ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరించారు. వెంటనే స్పందించిన సంజయ్కుమార్ చికిత్సకు అవసరమైన రూ.1.50లక్షల ఎల్వోసీని అతడి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే క్వార్టర్స్లో అందజేశారు. ఎల్వోసీ మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జగిత్యాల రూరల్ మండలంలోని మోరపెల్లి గ్రామానికి చెందిన ఆర్ ప్రసన్నకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.28వేల విలువ గల చెక్కును ఎమ్మెల్యే క్వార్టర్స్లో అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్లు రాజలింగం, మహిపాల్ రెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ రాయికల్ మండల ఉపాధ్యక్షుడు మహేశ్, గ్రామ శాఖాధ్యక్షుడు రత్నాకర్ రావు, ఉప సర్పంచ్ సాగర్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎర్రవేని తిరుపతి, సత్యం, బీసీ సెల్ మండల ఉపాధ్యక్షుడు వెంకటేశ్, గ్రామ కార్యదర్శి భూమయ్య పాల్గొన్నారు.