మంథని టౌన్, అక్టోబర్ 16: ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మంథని సామ్యెల్ మాదిగ కోరారు. మంథనిలో ప్రెస్ క్లబ్లో శనివారం జాతీయ మహాసభ కరపత్రాన్ని ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, ఎమ్మార్పీఎస్ అనేక అనుబంధ విభాగాలుగా నిర్మించామని వివరించారు. అందులో భాగంగానే ఏర్పడిన మాదిగ ఉద్యోగుల 5వ మహా సభను ఈ నెల 24వ తేదీన హైదరాబాద్లో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ మహాసభకు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, అబ్బయ్య నారాయణ స్వామి(కర్ణాటక), లోకనాథన్ మురుగన్(తమిళనాడు) హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మంథని చందు మాదిగ, కొయ్యల మొండి మాదిగ, వేల్పుల మొగిలి మాదిగ, శ్యాంసుందర్మాదిగ, నంబయ్య తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లిటౌన్,అక్టోబర్ 16: చలో హైదరాబాద్ను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంకూరి రమేశ్ కోరారు. పెద్దపల్లి అంబేద్కర్ విగ్రహం ఎదుట శనివారం పోస్టర్లు ఆవిష్కరించారు. ఇక్కడ నాయకులు అంబాల రాజేందర్,తాండ్ర శ్రీనివాస్, పోగుల వెంకటేశ్,సుద్దాల లింగయ్య,బాలక్రిష్ణ, కుక్కమళ్ల ప్రసాద్, కుక్క మహేశ్, దేవేందర్,శ్రావన్,హరికాళ్ల రాము, చిలుక ఎల్లయ్య,కల్వల మల్లేశ్,నెరివట్ల రామస్వామి, కాంపల్లి మల్లేశ్, బానేశ్, అంజయ్య, రవి పాల్గొన్నారు.