గ్రామ రెవెన్యూ సహాయకులను వివిధ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,620 సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి, విద్యార్హతలను బట్టి మూడు కేటగిరీల్లో భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మేరకు జిల్లా యంత్రాంగం శరవేగంగా కసరత్తు చేస్తున్నది. కలెక్టరేట్లకు చేరుతున్న వీఆర్ఏల వివరాల ఆధారంగా రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, మిషన్ భగీరథ శాఖలకు కేటాయిస్తున్నది. అర్హతల ఆధారంగా ఆఫీస్ సబార్డినేట్లు, చైన్మన్లు, హెల్పర్లు, లస్కర్లు, రికార్డు అసిస్టెంట్లు, వార్డు ఆఫీసర్లు, జూనియర్ అసిస్టెంట్లుగా భర్తీ చేస్తున్నది.
కరీంనగర్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : ఇన్నాళ్లూ గ్రామ రెవెన్యూ సహాయకులుగా ఉండి చాలీచాలని వేతనాలతో పనిచేసిన ఈ చిరుద్యోగుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపింది. వీఆర్ఏలకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గత నెల 24న జీవో 81ని విడుదల చేస్తూ వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది. అందుకు అనుగుణంగా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అంతకు మించి విద్యార్హతలు ఉండి 61 ఏళ్లలోపు ఉన్న వారిని గుర్తించి మూడు కేటగిరీల్లో సూపర్ న్యూమరీ పోస్టుల్లో భర్తీ ప్రక్రియ చేపట్టాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. అలాగే, ఈ నెల 3న దీనికి అను బంధంగా జీవో 85ను కూడా జారీ చేస్తూ నాలుగు శాఖల్లో సర్దుబాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు శరవేగంగా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. కాగా, 61 ఏళ్లు దాటిన వారి వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టనున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఆయా శాఖల్లో 1,620 పోస్టులు సృష్టించారు. వీఆర్ఏ విద్యార్హతల ఆధారంగా ఈ పోస్టుల్లో భర్తీ చేయనున్నారు. అందులో కరీంనగర్ జిల్లాలో 439, జగిత్యాలలో 412, పెద్దపల్లిలో 390, సిరిసిల్లలో 379 పోస్టులు ఉండగా, రెవెన్యూ, ఇరిగే షన్ శాఖల్లోనే ఎక్కువ పోస్టులు భర్తీ చేస్తున్నారు. శాఖల వారీగా చూస్తే రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా కరీంనగర్లో 68, జగిత్యాలలో 87, పెద్దపల్లిలో 64, సిరిసిల్లలో 58 పోస్టులు భర్తీ చేస్తు న్నారు. డిగ్రీ విద్యార్హతలు ఉన్న వారిని ఈ పోస్టుల్లో నియమిస్తున్నారు. ఇక ఇదే శాఖలో ఇంటర్ విద్యా ర్హత ఉన్నవారిని రికార్డు అసిస్టెంట్లుగా నియ మిస్తు న్నారు. కరీంనగర్లో 55, జగిత్యాలలో 55, పెద్ద పల్లిలో 71, సిరిసిల్లలో 50 పోస్టులు భర్తీ చేస్తు న్నా రు. 10వ తరగతి విద్యార్హతలున్న వారిని రెవె న్యూ శాఖలోనే ఆఫీస్ సబార్డినేట్, చైన్మన్లుగా నియమి స్తున్నారు. కరీంనగర్లో 10 చైన్మన్, జగిత్యాలలో మరో 10 చైన్మన్, పెద్దపల్లిలో ఆఫీస్ సబార్డినేట్లుగా 22, చైన్మన్ 17, సిరిసిల్లలో ఆఫీస్ సబార్డినేట్ 7, చైన్మన్ 9 పోస్టులను భర్తీ చేస్తున్నారు.