ధర్మారం,అక్టోబర్ 14: ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచే మంత్రి కొప్పుల ఈశ్వర్ మరోసారి ఔదార్యాన్ని చాటారు. నిరుపేద మహిళకు సొంత ఖర్చులతో ఇల్లు నిర్మించాలని సంకల్పించారు. ఈ మేరకు గురువారం ప్యాక్స్ చైర్మన్ బలరాంరెడ్డి స్థానిక టీఆర్స్ నాయకులతో కలిసి పనులు ప్రారంభించారు. ధర్మారం మండలం ఖిలావనపర్తికి చెందిన చెందిన కత్తెర్ల లక్ష్మికి ఆదిలాబాద్ జిల్లాలోని గంభీరావుపేటకు చెందిన శ్రీనివాస్తో కొన్నేండ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు బిడ్డలు సుప్రజ, ఇంద్రజ. పెద్ద కూతు రు సుప్రజ 9ఏండ్ల వయస్సులో ఉండగా, భర్త 10 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించా రు. ఈ క్రమంలో లక్ష్మి తల్లిగారి ఊరైన ఖిలావనపర్తిలో పూరి గుడసెలో మరోబిడ్డతో కలిసి ఉంటున్నది. కూలీనాలి చేసి బిడ్డను ఇంటర్ వరకు చదివించింది. అప్పుజేసి ఓ గుంట భూమికొన్నది. ఇంటిని నిర్మించుకునే స్థామతలేక తన స్థలంలో గుడిసె వేసుకుని బిడ్డతో కలిసి నివసిస్తున్నది.
హామీ ఇచ్చిన నెలలోపే కార్యరూపం
గతనెల 23న అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మి మంత్రిని కలిసి గోడు వెళ్లబోసుకున్నది. తాను ఉంటున్న గుడిసెను చూపించి ఇంటి నిర్మాణానికి సాయం చేయాలని ప్రాధేయపడింది. దీంతో చలించిపోయిన మంత్రి సొంత డబ్బుతో ఇంటిని నిర్మిస్తానని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో నెల తిరుగకముందే పనులు ప్రారంభింపజేశారు. అడిగిన వెంటనే సాయం చేసిన మంత్రికి లక్ష్మి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ఇక్కడ సర్పం చ్ సాగంటి తార,ఎంపీటీసీ మోతె సుజాత,ఉప సర్పంచ్ కీసర స్వరూప రాణి, ఏఎంసీ తాజా మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ పాకాల రాజయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, గ్రామ అధ్యక్షుడు మోతె అంజయ్య, నేతలు సాగంటి కొండయ్య, మోతె కనకయ్య, ఠాకూరు హన్మాన్ సింగ్, కాంపెల్లి రాజయ్య, జంగిలి గట్టు స్వామి, జంగిలి లక్ష్మణ్, మద్దునాల వెంకటేశ్, కాసిపాక శ్రీనివాస్, కనమండ రమేశ్ పాల్గొన్నారు.