స్కూటీ, ఆర్డీసీ బస్సు ఢీకొన్న ఘటనలో హెడ్మాస్టర్ దుర్మరణం
కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో రోడ్డు ప్రమాదం
పెద్దదిక్కు మరణంతో కుటుంబానికి తీరని దుఃఖం lరాజుపేట, గజ్యానాయక్ తండాల్లో విషాదఛాయలు
గంభీరావుపేట, జనవరి 14: సం క్రాంతి పండుగ పూట ఆ ఇంటా విషాదం నెలకొన్నది.. స్కూటీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో హెడ్మాస్టర్ దుర్మరణం చెందా డు.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి శివారులో శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.. ఇంటి పెద్దదిక్కు మరణం కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. స్థానికులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం..మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండాకు చెందిన భూక్య రాము(40) గంభీరావుపేట మండలం రాజుపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పండుగకు అత్తమ్మను తీసుకువచ్చేందుకు శుక్రవారం ఉదయం మాచారెడ్డి మండలంలోని రత్నగిరిపల్లెకు స్కూటీపై బయల్దేరాడు. మాచారెడ్డి-పెద్దమ్మ స్టేజీ మధ్యన ఆర్టీసీ బస్సు, స్కూటీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రాము తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. మరణవార్త తెలుసుకున్న భార్య కళావతి, ఇద్దరు కూతుర్లు, కొడుకు ఘటనాస్థలికి చేరుకుని విగతజీవిగా కనిపించిన పెద్దదిక్కును చూసి బోరుమన్నారు. ఎంతపని జేత్తివి దేవుడా.. పండుగనాడు మా కుటుంబానికి ఎంత అన్యా యం జేత్తివి’ అంటూ నెత్తినోరూ బాదుకుంటూ రోదించిన తీరు పలువురిని కంటతడిపెట్టించింది.
హెల్మెట్ ఉంటే బతికేవాడే..
రాము హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలతో బతికి బయటపడేవాడని అతడి స్నేహితులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సందర్భంలో రాము ఎగిరి కింద పడ్డాడు. అతడి తలకు తీవ్రగాయాలు తగలడం, తీవ్ర రక్తస్రావం కావడంతో దుర్మరణం పాలయ్యాడు.
స్కూల్తో ఏడేండ్ల అనుబంధం
రాము 1996-97లో ఎల్లారెడ్డిపేట జడ్పీస్కూల్లో పదో తరగతి పూర్తిచేశాడు. ఏడేండ్ల నుంచి రాజుపేట పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అందిరితో కలివిడిగా ఉండే ఆయ న అంటే తోటి ఉపాధ్యాయులతోపాటు, విద్యార్థులకు ఎంతో ఇష్టం ఉండేది. తల్లిదండ్రులతో సైతం పరిచయాలు ఉన్నాయి. తనతో పదో తరగతి పూర్తిచేసిన స్నేహితులతో కలిసి చేయూత ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకొనేవాడు. కాగా ఆయన మరణంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం విద్యారంగానికి తీరనిలోటని, ప్రమాదంలో యువ ఉపాధ్యాయుడిని కోల్పోవడం బాధాకరమని రాజుపేట సర్పంచ్ స త్యం, ఎంపీటీసీ పర్ష స్నేహలత, పంచాయతీ పాల కవర్గ సభ్యులు సంతాపం ప్రకటించారు. అతడి బాల్య స్నేహితులు రాముతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకుంటూ కన్నీళ్లపర్యంతమయ్యారు.