కలెక్టరేట్, మే 25: ఎంసెట్-2023 ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ విద్యాసంస్థ విజయభేరి మోగించింది. రాష్ట్రస్థాయిలో మూడంకెల సంఖ్యలో ర్యాంకుల పంట పండించి, ఉత్తర తెలంగాణలో మరోసారి తన సత్తా చాటుకున్నది. తమ పిల్లల భవిష్యత్తుకు వెలుగు దివ్వెగా భావిస్తూ, తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను సజీవంగా నిలిపింది.
వెయ్యిలోపు 14 మందికి ర్యాంకులు
అల్ఫోర్స్ యాజమాన్యం విద్యార్థులకు అందించిన తర్ఫీదుతో వెయ్యిలోపు 14 మంది, 5వేల లోపు 118 మంది ర్యాంకులు పొంది తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చబోతున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో ఎం అభిరామ్ 301వ ర్యాంకు సాధించి అత్యున్నత స్థానంలో నిలిచాడు. ఏ ఇషాంత్ రెడ్డి 322, జీ జ్యోతి 374ర్యాంకులు పొంది కాలేజీలో రెండు, మూడో స్థానాలు సంపాదించారు. అగ్రికల్చర్ విభాగంలో బీ శ్రీగోధ 356, టీ దీపిక 446 ర్యాంకులు సాధించగా, ఎం చిన్మయ్ 542, బీ శ్రీనివాస్ 650, ఎస్ సాయిసధిష్ట 681, కే ప్రణిత రెడ్డి 752, హస్వితరెడ్డి 818, బీ విద్యాలక్ష్మి 821, ఎస్ ధీరజ్ కుమార్ 833, ఎన్ మనస్విని 865, ఆర్ సుహాసిత 893వ ర్యాంకులు పొందారు. అలాగే 40 మంది విద్యార్థులు 2 వేల లోపు, 63 మంది 3వేలలోపు, 118 మంది 5వేలలోపు ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటారు. తకువ మంది విద్యార్థులతో అత్యధిక, అత్యద్భుత ర్యాంకులు సాధించడం అల్ఫోర్స్ విద్యార్థులకు మాత్రమే సాధ్యమని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన ఐఐటీ మెయిన్స్ ఫలితాల్లో కూడా అల్ఫోర్స్లో శిక్షణ పొందిన విద్యార్థులు చారిత్రాత్మక విజయం సాధించారు. 450 మంది విద్యార్థులు ఐఐటీ అడ్వాన్స్కు అర్హత పొందడం అల్ఫోర్స్లో అందించే విద్యా బోధనకు నిదర్శనమని స్పష్టమవుతోంది.
పటిష్ట ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణతోనే సాధ్యమైంది : చైర్మన్ డా. ఏ నరేందర్రెడ్డి
పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల కృషివల్ల అల్ఫోర్స్ ఇంతటి ఘనవిజయాలు సాధిస్తున్నదని, విద్యార్థుల అభినందన సభలో అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వీ నరేందర్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే నీట్ ఫలితాలలో అల్ఫోర్స్ మహోన్నత ర్యాంకులతో ముందంజలో ఉంటుందనే విశ్యాసాన్ని వ్యక్తం చేశారు. ఎంసెట్-2023 ఫలితాలలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అభినందించారు. తమ అత్యద్భుత విద్యాబోధనతో విద్యార్థుల విజయానికి పునాదులు వేసిన బోధన, బోధనేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇంజినీరింగ్ చేసి ఐఏఎస్ సాధిస్తా..
ఇంజినీరింగ్ పూర్తి చేసిన అనంతరం దేశంలోనే అత్యున్నత ఉద్యోగాలందించే సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలు రాస్తా. ఐఏఎస్ చేసి, పేద ప్రజలకు సేవలందిస్తా. నా ఎదుగుదలపై నా తల్లిదండ్రులు కంటున్న కలలు నిజం చేస్తా. నేను ఈ ర్యాంకు సాధించేందుకు అల్ఫోర్స్ యాజమాన్యం అందించిన పటిష్టమైన విద్యా ప్రణాళిక ఎంతగానో దోహదపడింది. అధ్యాపకుల క్రమబద్ధమైన బోధనతో, యాజమాన్య పర్యవేక్షణలో నిత్యం 14 గంటలు శ్రమించా. ఇదే స్ఫూర్తితో ఉన్నత చదువులు పూర్తి చేసి తల్లిదండ్రుల కల నెరవేర్చుతా.
– ఎం అభిరామ్, 301 ర్యాంకు
సాప్ట్వేర్ ఇంజినీరవుతా..
తల్లిదండ్రుల ప్రోద్భలంతో ఎంపీసీ తీసుకున్నా. సాప్ట్వేర్ ఇంజినీర్ కావాలనేది నా ఆకాంక్ష. నిర్ధిష్టమైన ప్రణాళిక, క్రమబద్ధమైన బోధనతో అల్ఫోర్స్ యాజమాన్యం అందించిన సహకారంతోనే ఈ ర్యాంకు సాధించా. అధ్యాపకులతో పాటు చైర్మన్ సర్ కూడా పాఠ్యాంశాల్లో వచ్చే అనుమానాలు ఓపిగ్గా నివృత్తి చేసేవారు. నిత్యం పది నుంచి పన్నెండు గంటలు చదువుతూ, పూర్తిస్థాయిలో పాఠాలు ఔపోసన పట్టడంతోనే ర్యాంకు సాధించడం సాధ్యమైంది.
– ఏ ఇషాంత్రెడ్డి, 322వ ర్యాంకు
వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి చేస్తా..
చిన్నప్పటి నుంచి వ్యవసాయ రంగంపై ఉన్న ఆసక్తితో ఇంటర్లో బైపీసీ తీసుకుని, ఎంసెట్ రాసా. ఊహించినట్లుగానే ర్యాంకు వచ్చింది. అగ్రికల్చర్ బీఎస్సీ, ఎమ్మెస్సీ పూర్తయిన అనంతరం ఆధునిక వ్యవసాయంపై పరిశోధనలు చేసి, రైతాంగానికి మేలు చేకూర్చేందుకు కృషి చేస్తా. వ్యవసాయరంగ అభివృద్ధితోనే దేశ పురోగతి సాధ్యమవుతుందనేది నా భావన.
– బీ శ్రీగోధ, 356వ ర్యాంకు