పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు
బాధిత కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ
కమాన్పూర్, జనవరి 12: ప్రమాదవశాత్తూ మరణించిన కార్యకర్తల కుటుంబాలకు గులాబీ పార్టీ అండగా నిలుస్తుందని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు పేర్కొన్నారు. జూలపల్లి పంచాయతీ పరిధిలోని ముల్కలపల్లి, కమాన్పూర్, రొంపికుంటకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు మచ్చ సతీశ్, పులి శ్రీనివాస్, బండ అర్జయ్య, పొన్నం నర్సయ్య, కొయ్యడ రజిత మరణించగా వారికి రూ.2లక్షల చొప్పున ప్రమాద బీమా మంజూరైంది. ఇందుకు సంబంధించిన చెక్కులను పుట్టమధు బుధవారం కమాన్పూర్లో బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సభ్యత్వం తీసుకున్న వారందరి పేరిట పార్టీ ప్రమాద బీమా చేయించిందన్నారు. బీమా పరిహారంతో పాటు ప్రభుత్వం ద్వారా సైతం ఆదుకుంటున్నామని చెప్పారు. ఇక్కడ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్రెడ్డి కిషన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు, వైస్ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, సర్పంచులు బొల్లపెల్లి శంకర్ గౌడ్, నీలం సరిత, కొండ వెంకటేశ్, ఎంపీటీసీలు కోలేటి చంద్రశేఖర్, బోనాల వెంకటస్వామి, ఉప సర్పంచులు పోలుదాసరి సాయికుమార్, బొజ్జ రాజసాగర్, నేతలు రామారావు, రవి, శ్రీనివాస్, సంతోష్రెడ్డి, కనకయ్య, అనిల్ గౌడ్, కృష్ణమూర్తి, రాజయ్య, సాయికుమార్, సతీశ్, ఆంజనేయులు, జ్యోతి, మల్లేశ్, తిరుపతి, రవి, రాంమూర్తి, చలమయ్యగౌడ్, అనిల్, విజయ్, చిన్న శ్రీనివాస్, లక్ష్మణ్, దశరథం, రాజయ్య, కుమార్, ప్రసాద్, ప్రవీణ్, సురేశ్, కుమార్, అనిల్, రాజయ్య గౌడ్, స్వామి, శ్రీనివాస్, నజీబ్, దాసరి విష్ణు, మంథని రఘు తదితరులు ఉన్నారు.