ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో వేడుకలు
ఆడిపాడిన మహిళలు, యువతులు, విద్యార్థినులు
ఓదెల, అక్టోబర్ 11: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయానికి బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఎంపీపీ కునారపు రేణుకాదేవి పేర్కొన్నారు. ఓదెల మండల పరిషత్ కార్యాలయం ఎదుట మహిళలతో సోమవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. అంగన్వాడీ, సెర్ప్ స్వశక్తి మహిళలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మహిళా సిబ్బంది బతుకమ్మ ఆడారు. ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ ఆడి పాడారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ, ఏపీఎం లతామంగేశ్వరి, డాక్టర్ లావణ్య, ఎంపీడీవో సత్తయ్య, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు కావటి రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్, అక్టోబర్11: మండల కేంద్రంలో సెర్ప్ సిబ్బంది ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ముందస్తు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తీరొక్క పువ్వును సేకరించి, అందంగా బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, ఎంపీడీవో రాంమోహనాచారి, ఏపీఎం సదానందం, ఈజీఎస్ ఏపీవో మంజుల తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జంక్షన్, అక్టోబర్ 11: పట్టణంలోని గాయత్రి జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. తీరొక్క పూవ్వులతో బతుకమ్మలను ఆకర్షణీయంగా అలంకరించి సంప్రదాయ వేషధారణలో విద్యార్థినులు ఆడిపాడారు. కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్, కరస్పాండెంట్ అల్లెంకి రజని, ప్రిన్సిపాల్ సురేశ్ పాల్గొన్నారు.
ప్రత్యేక గుర్తింపు : మంత్రి సతీమణి స్నేహలత
ధర్మారం, అక్టోబర్ 11: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ‘బతుకమ్మ పండుగ’కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ఎల్ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొప్పుల స్నేహలత అన్నారు. ఈ మేరకు సోమవారం ధర్మారంలో మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు స్నేహలత హాజరై ఎంపీపీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ఎంపీడీవో జయశీల, ఐసీడీఎస్ సూపర్ వైజర్ జమునతోపాటు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. వేడుకలను నిర్వహించిన ఎంపీపీని స్నేహలత అభినందించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బతుకమ్మ ఆటలో పాల్గొన్న ఇద్దరు బాలికలకు లయన్స్ క్లబ్ తరపున గిఫ్ట్ వాచ్లను స్నేహలత అందించారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ సలామొద్దీన్, ఉప సర్పంచ్ ఆవుల లత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్,ప్రధాన కార్యదర్శులు కూరపాటి శ్రీనివాస్, దొనికెని తిరుపతి, పట్టణాధ్యక్షుడు బాస తిరుపతి రావు, నాయకులు మంద శ్రీనివాస్, దేవి నళినీకాంత్, ఎండీ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.