విద్యానగర్, నవంబర్ 8 : మహానగరాలకే పరిమితమైన మల్టిపుల్ డెబ్రిడీమెంట్స్ అండ్ లింబ్ సా ల్వేజ్ సర్జరీని కరీంనగర్ మెడికవర్ విజయవంతంగా పూర్తి చేసినట్లు దవాఖాన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బీ సాయిఫణిచంద్ర తెలిపారు. 50 రోజుల పాటు చికిత్స చేసి, 7 సర్జరీలు, గ్రాఫ్టింగ్ చేసి రోగి ప్రాణాలు కాపాడినట్లు వెల్లడించారు. సోమవారం దవాఖానలో విలేకరులతో మా ట్లాడారు. ఇల్లంతకుంట మండలం పొత్తూరుకు చెందిన చక్రాల శ్రీనివాస్పై లోడ్తో ఉన్న ట్రాక్టర్ టైర్ నడుంభాగం, తొడ నుంచి మోకాలు కింది వరకు వెళ్లింది. దీంతో నడుం, కాలు ఎముకలు నుజ్జునుజ్జయ్యాయి. అతి పెద్ద ప్రమాదం జరిగి రక్తస్రావం కావడంతో, ప్రాణాపాయ స్థితిలో జూ లై 29న వైద్యశాలకు వచ్చారు. అన్ని పరీక్షలు చేసి ఆర్టీఏ విత్ పాలిట్రామా అండ్ సివియర్ క్రష్ ఇం జ్యూరీ రైట్ థై విత్ సరమ్ ఫెరెన్సియల్ డీగ్లవింగ్ అండ్ పెల్విక్ ఫ్రాక్చర్గా గుర్తించామన్నారు. శ్వా స తీసుకోలేని పరిస్థితిలో బీపీ పూర్తిగా పడిపోయి ఉన్న శ్రీనివాస్ను రెండు రోజుల పాటు వెంటిలేటర్పై ఉంచి, ఆతర్వాత మల్టిపుల్ డెబ్రిడీమెంట్స్ అండ్ లింబ్ సాల్వేజ్ పద్ధ్దతిన 7 సర్జరీలు చేశామన్నారు. సిన్ మొత్తం వ్యాక్యూమ్ మిషన్తో తొలగించి గ్రాఫ్టింగ్ చేయడంతో పాటు రక్తస్రావం ఎకువ కావడంతో 10 యూనిట్ల రక్తం అందించి ప్రాణా లు కాపాడినట్లు వెల్లడించారు. కాగా ప్రాణాలు కాపాడిన వైద్యులకు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మెడికవర్ అడ్మినిస్ట్రేటర్ గుర్రం కిరణ్, డాక్టర్ బీ వినయ్, డాక్టర్ సుస్మిత పాల్గొన్నారు.
రేపు ఉచిత వస్యులర్ కన్సల్టేషన్..
కరీంనగర్ మెడికవర్ దవాఖానలో బుధవారం సీనియర్ వస్యులర్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఉచిత వస్యులర్ కన్సల్టేషన్ నిర్వహిస్తున్నట్లు వైద్యశాల అడ్మినిస్ట్రేటర్ గుర్రం కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాలులో వాపు, నొప్పి, నరాలు ఉబ్బుట, నరాలు చిట్లుట, పాదము నల్లబడుట, వెరికోస్ వీన్స్, రక్తప్రసరణ నెమ్మ దించుట, మానని పుండ్లు, గాయాలు, డయాబెటిక్ ఫుట్, నరాలలో అవరోధం, డీవీటీ, తిమ్మిర్లు వంటి సమస్యలతో సతమతమవుతున్న వారు డాక్టర్ను ఉచితంగా సంప్రదించి వైద్య సేవ లు పొందవచ్చని పేరొన్నారు. దవాఖానలో ఉ దయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు డాక్టర్ అందుబాటులో ఉంటారని చెప్పారు.