మేయర్ వై.సునీల్రావు
30వ డివిజన్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభం
వ్యాక్సినేషన్ కేంద్రం పరిశీలన
కార్పొరేషన్, జనవరి 8: నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని నగర మేయర్ వై.సునీల్రావు పేర్కొన్నారు. నగరంలోని 30వ డివిజన్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. శివారు డివిజన్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రత్యేక నిధులు, పట్టణ ప్రగతి నిధులతో అన్ని డివిజన్లలోనూ చేపట్టిన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.100కోట్ల నిధులను విడుదల చేసిందన్నారు. పెండింగ్, కొత్త పనులు పూర్తి చేసే అవకాశముందన్నారు. స్మార్ట్ టాయిలెట్స్, వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేశామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధిలో వెనుకబడిన కాపువాడ, మారుతీనగర్ లాంటి ప్రాంతాల అభివృద్ధికి పాలకవర్గం ముందుకు సాగుతుందన్నారు. కాపువాడ బైపాస్గా పేరు గాంచిన వరాహస్వామి టెంపుల్ ఏరియా రోడ్డును స్మార్ట్సిటీలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించామన్నారు. స్మార్ట్సిటీ కింద హౌసింగ్బోర్డు కాలనీ మొత్తాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్పాత్ పనులన్నీ త్వరలో పూర్తవుతాయని పేర్కొన్నారు. హౌసింగ్ బోర్డులో ఇప్పటివరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. పెండింగ్లో ఉన్న 2 కిలోమీటర్ల పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. నగర ప్రజలకు రాబోయే రోజుల్లో 24గంటలు తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పనులు జరిగే ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు. కార్పొరేటర్ నేతికుంట యాదయ్య, టీఆర్ఎస్ నాయకులు వంగల పవన్, నగర పాలకసంస్థ అధికారుల పాల్గొన్నారు.
తప్పనిసరిగా టీకా వేయించాలి
15-18 ఏండ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా కొవిడ్ టీకా వేయించాలని నగర మేయర్ వై.సునీల్రావు పేర్కొన్నారు. 33వ డివిజన్ భగత్నగర్లో ఓ ప్రైవేట్ సూల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. మూడో వేవ్ ముప్పును ఎదుర్కొనేందుకు నగరపాలక సంస్థ, జిల్లా వైద్యశాఖ సిద్ధంగా ఉందన్నారు. వందశాతం వ్యాక్సినేషన్ను పూర్తి చేసిన నగరంగా కరీంనగర్ను మార్చుతామన్నారు. ప్రభుత్వ దవాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్లలో ఆరు వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, తమ వినతి మేరకు అదనంగా 10 సెంటర్లను పెంచారని పేర్కొన్నారు. నగర ప్రజలు 15.18ఏండ్ల పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు. ప్రతి ఒకరూ భౌతికదూరం పాటించాలని, మాసులు ధరించాలని, శానిటైజర్ను వినియోగించాలని సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.