జిల్లా వ్యాప్తంగా ఎంపీ సంతోష్కుమార్ పుట్టిన రోజు వేడుకలు
కేక్ కట్ చేసి మొక్కలు నాటిన టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ నాయకులు
కార్పొరేషన్, డిసెంబర్ 7: జిల్లాలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ పుట్టిన రోజు వేడుకలను మంగళవారం టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని మారెట్ రోడ్డులో గల వేంకటేశ్వర స్వామి ఆలయంలో టీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ పొన్నం అనిల్కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. మారెట్లో కూరగాయల విక్రయదారులు, పేదలు 200 మందికి అల్పాహారం అందజేశారు. ఈసందర్భంగా అనిల్కుమార్ గౌడ్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్కు వెన్నుదన్నుగా ఉంటూ, గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా విరివిగా మొక్కలు నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. భవిష్యత్లో ఇంకా అనేక పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పబ్బతి శ్రీనివాస్రెడ్డి, ఆరే రవిగౌడ్, చుక శ్రీనివాస్, కత్తి శ్రీనివాస్, గందె కల్పన, రుద్ర రాధ, వడ్లకొండ పరశురాములు, జకుల అఖిల్గౌడ్, బొంకూరి మోహన్, మాడిశెట్టి అజయ్కుమార్, వినోద్, బోడ ఆంజనేయులు, శనిగరపు సతీశ్, ప్రశాంత్, రాజు, కొలపురి చంద్రశేఖర్, ప్రిన్స్ రాజు తదితరులు పాల్గొన్నారు. స్థానిక అయ్యప్ప ఆలయంలో టీఆర్ఎస్ నాయకుడు పెండ్యాల మహేశ్కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో స్వాములకు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి బియ్యం, వంట సామగ్రి అందజేశారు. అలాగే, కృష్ణనగర్లోని అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు దెబ్బటి సూర్య, అజయ్, రామగిరి శంకర్గురుస్వామి, వినోద్, సొల్లు రవి, కోడి శ్రీను, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. పెండ్యాల మహేశ్ గురుస్వామి హైదరాబాద్లో ఎంపీ సంతోష్కుమార్ను కలిసి, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
కొత్తపల్లి, డిసెంబర్ 7: హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొలిపాక మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. వినాయక ప్రతిమ, పూల మొక్క అందజేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
గంగాధర, డిసెంబర్ 7: మండలంలోని బూరుగుపల్లిలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ పుట్టిన రోజును పురస్కరించుకొని గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్రావు, సర్పంచ్ సాగి రమ్య మొక్కలు నాటారు. మహిపాల్రావు మాట్లాడుతూ, ఎంపీ సంతోష్కుమార్ దేశం మొత్తం మొక్కలు నాటిస్తూ గ్రీన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా నిలిచారని కొనియాడారు.
చొప్పదండి, డిసెంబర్ 7: ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ను టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గడ్డం చుక్కారెడ్డి హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేసి, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట నాయకులు ఉన్నారు.