రామగిరి, అక్టోబర్ 7: అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ తెలిపారు. రత్నాపూర్ గ్రామానికి చెందిన చిదురాల సారంగపాణి, సుగుణ దంపతుల కుమార్తె రమ్య అనారోగ్యంతో బాధపడుతున్నందున ఉన్నత వైద్యం కోసం జడ్పీ చైర్మన్ ప్రత్యేక చొరవ తీసుకొని రూ.1.50 లక్షలు ఎల్వోసీ మం జూరు చేయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, మధూకర్కు సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు, ఎం పీటీసీల ఫోరం అధ్యక్షుడు ధర్ముల రాజ సంపత్, ఉప సర్పంచ్ సత్యరెడ్డి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రశాంత్, రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు.
యైటింక్లయిన్ కాలనీకి చెందిన మాజీ కార్పొరేటర్ కోండ్ర స్టాలిన్ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొంది సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా రూ.60వేలు మంజూరయ్యాయి. ఈ చెక్కును జడ్పీ చైర్మన్ అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, ఆర్బీఎస్ బాధ్యుడు మేదరబోయిన కుమార్, ముత్తారం సింగిల్ విండో చైర్మన్ రాజిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు పాశం ఓదెలు, ధర్ముల రాజ సంపత్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, ఏఎంసీ డైరెక్టర్ ఆసం తిరుపతి, నాయకులు భాస్కర్, అల్లం తిరుపతి, జవహర్, సంపత్ రెడ్డి, సాంబయ్య, కృష్ణ, శ్రీనివాస్, బత్తుల రమేశ్, వెంకటేశ్, మల్లేశ్ ఉన్నారు.
సుల్తానాబాద్ రూరల్, అక్టోబర్ 7: తొగర్రాయికి చెందిన రమ్య అనారోగ్యానికి గురికాగా ఆమెకు వైద్య ఖర్చుల కోసం జడ్పీ చైర్మన్ ప్రభుత్వం ద్వారా ఎల్వోసీని మంజూరు చేయించారు. రూ.1.50 లక్షలను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించగా రాష్ట్ర ప్రభుత్వం, జడ్పీ చైర్మన్కు రమ్య కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
జూలపల్లి, అక్టోబర్ 7: చీమలపేట గ్రామానికి చెందిన తొంటి బుచ్చయ్య అనారోగ్యంతో బాధపడుతూ, ఓ ప్రైవేటు దవాఖానలో వైద్యం చేయించుకున్నాడు. ఈ క్రమంలో ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద రూ. లక్ష మంజూరు చేయగా, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్ ఆ చెక్కును బుచ్చయ్యకు అందజేశారు. ఇక్కడ సర్పంచ్ తొంటి పద్మ, ఉప సర్పంచ్ ముత్యాల పావని, నాయకులు చొప్పరి శేఖర్, రనవేని సంపత్, తొంటి రాజేశం, సొల్లు శ్యామ్, లంక తిరుపతి, రాయుడు, కుమారస్వామి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి, అక్టోబర్7: ముంజంపల్లి, మారేడుపల్లికి చెందిన వెంకటయ్య, ఉట్ల నందయ్య, గర్వందుల లక్ష్మి, అల్లం లక్ష్మికి ఎంపీపీ వ్యాళ్ల అనసూర్యరాంరెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.