కరీంనగర్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): నిర్దేశించిన లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేయాలని, పనులు పూర్తి చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరీంనగర్ నగరపాలక సంస్థ, చొప్పదండి, కొత్తపల్లి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో శనివారం ఆయన ఇంటిగ్రేటెడ్ మారెట్లు, వైకుంఠధామాలు, హరితహారం, కొవిడ్ వ్యాక్సినేషన్, శానిటేషన్ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఇంటిగ్రేటెడ్ కూరగాయల, మాంసం మారెట్లను ప్రారంభించాలన్నారు. వైకుంఠధామాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. హరితహారంలో భాగంగా నర్సరీలు, అవెన్యూ ప్లాంటేషన్, మియావాకీ పద్ధతిలో ప్లాంటేషన్ చేపట్టాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో రోడ్లకు ఇరువైపులా పూల మొకలు నాటించాలన్నారు. స్మార్ట్సిటీ రోడ్లలో అందమైన పూల మొకలు నాటాలని, స్మృతి వనాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
మున్సిపల్ పరిధిలో మొదటి, రెండో డోసు కొవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలని కమిషనర్లను, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు, తదితర పనులను వెంటనే పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. డెంగ్యూ ప్రబలకుండా పారిశుధ్య పనులు, డ్రైడే, ఫాగింగ్ చేపట్టాలన్నారు. పబ్లిక్ టాయిలెట్లను ప్రజలు ఉపయోగించుకునేలా సక్రమంగా నిర్వహణ చేపట్టాలని సూచించారు. నగరంలో ఎనిమల్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ యాదగిరి రావు, ఈఈ రామన్, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్రావు, కొత్తపల్లి, చొప్పదండి, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్లు, హుజూరాబాద్ మున్సిపల్ మేనేజర్, అసిస్టెంట్ ఇంజినీర్లు, డీఎంహెచ్వో జువేరియా, మెప్మా పీడీ రవీందర్, కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ సుధాకర్ పాల్గొన్నారు.