ముఖ్యమంత్రి,కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్రపటాలకు పాలాభిషేకం
వెల్గటూర్, అక్టోబర్ 6: కోటిలింగాలను అభివృద్ధి చేస్తామని ముఖ్య మంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతు న్నది. శాతవాహనుల మొట్టమొదటి రాజధాని నగరమైన కోటిలింగాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అసెంబ్లీలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మా ట్లాడుతూ, సమైక్య పాలనలో రాష్ట్రంలోని చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి ఏనాడూ నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవన్నారు. స్వరాష్ట్రంలో ఆలయాలు, చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి ఎన్నో నిధులు విడుదల చేశామని, కోటిలింగాల ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు స్వాగతిస్తూ బుధవారం కోటిలింగాల వద్ద సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఇక్కడ జడ్పీటీసీ సుధారాణి, సర్పంచ్ నక్క మౌనిక రవితేజ, ఆలయ కమిటీ చైర్మన్ నారాయణరావు, రాంచందర్గౌడ్, నేతలు రామస్వామి, సుధాకర్రావు, తిరుమలాచారి, సతీశ్, నాగరాజుశర్మ ఉన్నారు.