టీఆర్ఎస్లో చేరికల జోరు
కమలాపూర్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ సమక్షంలో భారీగా పార్టీలోకి..
ఆయాచోట్ల ఆహ్వానించిన ఎమ్మెల్యేలు
జమ్మికుంట/ ఇల్లందకుంట/ వీణవంక రూరల్/కమలాపూర్/ కమలాపూర్ రూరల్, అక్టోబర్ 6: టీఆర్ఎస్ బలం.. బలగం పెరుగుతున్నది. స్వరాష్ట్రంలో.. స్వాభిమానంతో ఏడున్నరేండ్లు సాగిన పాలనకు ప్రతిపక్ష నాయకులు సహా ప్రజానీకం ఫిదా అవుతున్నది. టీఆర్ఎస్కు జైకొడుతూ పార్టీలో చేరిపోతున్నది. బుధవారం కమలాపూర్ మండలం అంబాల, శంభునిపల్లి గ్రామాల్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ సమక్షంలో గ్రామస్తులు పార్టీలోకి రాగా, ఇల్లందకుంట మండలం సిరిసేడు, జమ్మికుంట పట్టణంలో పలువురు యువకులకు ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, నరేందర్ వేర్వేరుగా కండువాలు కప్పి ఆహ్వానించారు.
అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ వైపే..
హుజూరాబాద్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండే
టీఆర్ఎస్కు సిరిసేడు యువత జై..
ఇల్లందకుంట మండలం సిరిసేడుకు చెందిన యువకులు సర్పంచ్ రఫీఖాన్, ఎంపీటీసీ చిన్నరాయుడు, మాజీ ఎంపీటీసీ బుర్ర రమేశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా రవి శంకర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరినవారిలో నేరెళ్ల సందీప్, బుర్ర శరత్, రాకేశ్, పరకాల అనిల్, మల్యాల రాజయ్య, ఉమ్మగోని హరిప్రసాద్ ఉన్నారు.
బీజేపీ నాయకుల క్యూ..
వీణవంక మండలం ఘన్ముకులకు చెందిన బీజేపీ నాయకులు బుధవారం ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాసరి మనోహర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారు కండువా కప్పి ఆహ్వానించారు. చేరిన వారిలో సంగ శ్రీను, జూమాల అజయ్, మర్రి సంతోష్, అశోక్,వేణు, శ్రీకాంత్, కుమార్, రాజు ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు యువకులు తెలిపారు. ఇక్కడ క్లస్టర్ ఇన్చార్జి పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, ఎంపీటీసీ కాసం వీరారెడ్డి, రవియాదవ్ పాల్గొన్నారు.