మేడిపల్లి, నవంబర్ 5: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, మరింత ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు ఉద్ఘాటించారు. శుక్రవారం మేడిపల్లి మండలం వల్లంపల్లిలో 1.40 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్ను జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ప్రారంభించారు. అనంతరం 10 లక్షలతో నిర్మించిన పల్లె ప్రకృతి వనం, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం మాట్లాడారు. ప్రభుత్వం బడులలో మౌలిక వసతుల కల్పన కోసం త్వరలోనే 3 కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. ఎస్సారెస్పీ కెనాల్పై వంతెన నిర్మాణం కోసం 3.25 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. రైతులు ఆందోళన చెందవద్దని, పండిన చివరి గింజా కొంటామని స్పష్టం చేశారు. 33/11 కేవీ సబ్స్టేషన్లపై ఒత్తిడి పెరగకుండా మెరుగైన విద్యుత్ను అందించేందుకు 20 కోట్లతో 133/33 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఇక్కడ జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్రావు, ఎంపీపీ దొనకంటి ఉమాదేవి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వంగ వెంకటేశం, సర్పంచులు వెల్మ సమత, కాచర్ల సురేశ్, గడ్డం నారాయణరెడ్డి, కుందూరి బాలరాజు, దుంపేట లక్ష్మీనర్సయ్య, ఎంపీటీసీలు నాయిని మమత, మకిలి దాస్, ఆదె రాజన్న, సింగిల్ విండో చైర్మన్ మెన్నేని రవీందర్రావు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మిట్టపెల్లి భూమారెడ్డి, డీఈ గంగారాం, ఏడీ నటరాజ్, ఏఈలు దివాకర్రావు, గంగాధర్, సబ్ ఇంజినీర్ శశిధర్, నాయకులు వెల్మ నవీన్రెడ్డి, నాయిని రవి, నాంచారి రాజేందర్, దురిశెట్టి లక్ష్మణ్కుమార్ తదితరులున్నారు.