విద్యానగర్, డిసెంబర్ 4 : హైదరాబాద్ లాంటి నగరాలకు మాత్రమే పరిమితమైన ప్రెస్టో గెమోబార్ నగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్లో ప్రారంభమైంది. వినూత్న హంగులు, అధునిక సౌకర్యాలతో యువత కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఈ బార్ శనివారం సాయంత్రం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు అట్టహాసంగా ప్రారంభించగా పలువురు పాల్గొన్నారు. సినిమా, హోటల్, లాడ్జి వంటి సౌకర్యాలతో ఇప్పటికే అలరిస్తున్న ప్రతిమ మల్టీప్లెక్స్కు గేమోబార్ కొన్ని హంగులను తెచ్చినట్లయింది. థియేటర్స్, హోటల్, బంకెట్హాల్, షాపింగ్ కాంప్లెక్స్ వంటి వాటితో ప్రజలకు మరింత వినోదం అందిస్తూ చేరువయ్యేందుకు గాను ఇటీవలే పునర్నిర్మాణం చేశారు. ప్రెస్టో గేమోబార్ మొదటి అంతస్తులో ఏర్పాటు చేశారు. యువత మానసికోల్లాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బార్ను ఏర్పాటు చేశామని, ఇది కేవలం యువత కోసం వినియోగిస్తామని, ఇందులో బార్, ఫుడ్తో పాటు ఇండోర్ గేమ్స్ ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆర్కెస్ట్రా అలరించింది. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ప్రతిమ మల్టీప్లెక్స్ను తీర్చిదిద్దామని నిర్వాహకులు తెలిపారు.