పాలకుర్తి, అక్టోబర్4: పాలకుర్తి మండలం వేంనూర్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పెండింగ్ నిధులు విడుదల చేయాలని వేంనూర్ గ్రామస్తులు కలెక్టర్ను సోమవారం కోరారు. పెండింగ్లో ఉన్న 234 మందికి సంబంధించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వెంటనే ఇవ్వాలని విన్నవించారు. 2010లో 80 మందికి, 2015లో 150 మంది అర్హులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇంటింటికీ మరోసారి సర్వే నిర్వహించి అర్హులకు ప్యాకేజీ వచ్చేలా చూడాలని కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
మేడిపల్లి, లింగాపూర్ వాసులు..
జ్యోతినగర్, ఆక్టోబర్ 4: సింగరేణి మేడిపల్లి ఓసీపీ-4 ప్రభావిత మేడిపల్లి, లింగాపూర్ బాధిత ప్రజలు కంపెనీ నుంచి రావాల్సిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లింపుపై కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణను సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ ఈ నెల 8వ తేదీన సింగరేణి అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. సమావేశానికి ఇరు గ్రామాల ప్రజలు రావాలని సూచించినట్లు వారు చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ సానపురి శ్రీనివాస్, శ్రావణ్కుమార్, మాజీ సర్పంచ్ ఇరికిల్ల శంకరయ్య, కాసర్ల మల్లేశ్, రామటెంకి మల్లేశ్, నర్సయ్య, జీ నర్సయ్య, పోషమ్మ, మల్లేశ్వరి తదితరులు ఉన్నారు.