సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 4: కేడీసీసీబీ వంద సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో వచ్చే నవంబర్లో శత వసంతాల వేడుకల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మం డల కేంద్రంలోని కేడీసీసీబీని సోమవారం ఆయన సందర్శించారు. రూ.2 కోట్ల విలువైన రుణాలతోపాటు లబ్ధిదారుడికి హార్వెస్టర్ను అందజేసి మాట్లాడారు. కేడీసీసీబీ రైతులతోపాటు అన్నివర్గాల వారికి సేవలు అందిస్తున్నదన్నారు. జాతీయ బ్యాం కులకు దీటుగా పని చేస్తుండడం సంతోషకరమన్నారు. 7.70లక్షల మంది ఖాతాదారులు ఉన్నారని, 4500 కోట్ల టర్నోవర్ జరిగిందని చెప్పారు. ఈ సంవత్సరం 5వేల కోట్ల టర్నోవరే లక్ష్యమని పేర్కొన్నారు. తంగళ్లపల్లి కేడీసీసీబీ రెండేళ్లలోనే 22 కోట్ల టర్నోవర్ చేసిందని, 5.50కోట్ల డిపాజట్లను సేకరించడం హర్షణీయమన్నారు. బ్యాంక్ మేనేజర్తోపాటు సిబ్బందిని అభినందించారు. అంతకుముందు చిన్నలింగాపూర్లో శ్యాగ దేవేందర్కు చెందిన టెంట్హౌజ్ను ప్రారంభించారు. ప్రతిఒక్కరూ బ్యాంకు సేవలను సద్వినియో గం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని కోరా రు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్రావు, కౌన్సిలర్లు కల్లూరి రాజు, రాపెల్లి లక్ష్మీనారాయణ, గుడ్ల శ్రీనివాస్, దార్ల సందీప్, గోదావరి బ్యాంక్ ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.