ఒగ్గు బీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఒగ్గు ధర్మయ్య
పెద్దపల్లిలో జానపద కళారూపం-ఒగ్గుకథ విశిష్టతపై జాతీయ సదస్సు
పెద్దపల్లి టౌన్, అక్టోబర్ 3: శ్రామికుల కష్టానికి కళారూపమే ఒగ్గుకథ అని ఒగ్గు బీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఒగ్గు ధర్మయ్య పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక డైరెక్టర్ మామిడి హరికృష్ణ సూచన మేరకు కావటి మల్లయ్య ఒగ్గు కళా సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం పెద్దపల్లిలోని సిరి ఫంక్షన్హల్లో ‘జానపద కళారూపం, ఒగ్గు కథ విశిష్టతపై జాతీయ సదస్సును ఏర్పాటు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధన విద్యార్థులు అశ్విని, గిరీశం, తిరుపతి, మహేందర్రెడ్డి, కిషన్, ఉపేందర్ ఒగ్గు కళారూపాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ధర్మయ్య మాట్లాడుతూ, అణగారినవర్గాల బిడ్డలు ఉన్నత చదువులు అభ్యసించి ఒగ్గు కథ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పడం గొప్ప విషయమన్నారు. శ్రామికుల జీవన విధానంపై రంగారెడ్డి జిల్లా నుంచి కళాకారిణి మల్లారి ప్రద ర్శన చేశారు. అనంతరం పరిశోధనా విద్యార్థులను నిర్వాహకులు సన్మానించారు. ఇక్కడ పోషణవేన శ్రీహరియాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉస్తాద్ రవికుమార్, ఓదెల జడ్పీటీసీ గంట రాములు, శ్రీనివాస్యాదవ్, పరిశోధనా విద్యార్థి కావటి సతీశ్యాదవ్, మారం తిరుపతి, ఉడుత పర్వతా లు, సదయ్య, ఐలయ్య, ఎలబోయిన తిరుపతి, పెద్ది తిరుపతి, రవికుమార్యాదవ్ పాల్గొన్నారు.