అభివృద్ధిపై చర్చకు సిద్ధం
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి
రంగాపూర్లో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 3: గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. ఎస్డీఎఫ్ నిధులు 9లక్షలతో పెద్దపల్లి మండలం రంగాపూర్లో ఆదివారం ఆయన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి, మాట్లాడారు. ప్రజా సంక్షేమ మే కేసీఆర్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. గత ప్రభుత్వాలతో పోల్చితే అభివృద్ధి అంటే ఏంటో అర్థం అవుతుందని స్పష్టం చేశారు. ఏడేండ్లుగా కేసీఆర్ సర్కారు చేసిన అభివృద్ధి గ్రామాల్లో ఎక్కడా చూసి నా కనిపిస్తుదన్నారు. మట్టి రోడ్లను సీసీగా మార్చేందుకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు పాలించిన వారం తా మాయ మాటలు చెప్పారే తప్పా.. అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రస్తుతం గ్రామాల్లో జరిగిన అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ దిశగా నడిపిస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, సర్పంచ్ గంట లావణ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ కొయ్యెడ సతీశ్గౌడ్, నాయకులు బండారి శ్రీనివాస్గౌడ్, గంట రమేశ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.