పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి
లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు, బతుకమ్మ చీరెల పంపిణీ
జూలపల్లి, అక్టోబర్ 2: పేదింటి ఆడబిడ్డల పెండ్లి తల్లి దండ్రులకు భారంకావద్దని సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి పథకంతో భరోసా కల్పిస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం 48మంది లబ్ధిదారులకు 48,05,568 విలువైన చెక్కులను, పలువురు మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాటాడుతూ, కల్యాణ లక్ష్మి ద్వారా సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల పెం డ్లికి ఆర్థిక సాయం అందిస్తున్నారని కొనియాడారు. ప్రభు త్వ పనితీరు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, ఏఎంసీ చైర్మన్ కంది చొక్కారెడ్డి, ధూళికట్ట పీఏసీఎస్ చైర్మన్ పుల్లూరి వేణుగోపాల్రావు, సర్పంచులు దారబోయిన నరసింహం, మేచినేని సంతోశ్రావు, ఈర్ల మల్లేశం, బంటు ఎల్లయ్య, మాంకాళి తిరుపతి, పొలవేని వీరయ్య, ఎంపీటీసీలు దండె వెంకటేశం, తమ్మడవేని మల్లేశం, గొట్టెముక్కుల రజని, కోఆప్షన్ సభ్యుడు లాల్మహ్మద్, మం డల ప్రత్యేకాధికారి రంగారెడ్డి, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో వేణుగోపాల్రావు, నేతలు నల్లాల కన్కరాజ్, కొత్త రవీందర్, సొల్లు శ్యామ్, శాతళ్ల కాంతయ్య, కొప్పుల మహేశ్, అడువాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.