ఇంటింటా ప్రచారంలో టీఆర్ఎస్వై నేతలు
టేకుర్తి, చిన్నకోమటిపల్లి గ్రామాల్లో ఓట్ల అభ్యర్థన
కరపత్రాలు పంచుతూ పథకాలపై అవగాహన
ఇల్లందకుంట, సెప్టెంబర్ 2: అమ్మలారా..అయ్యలారా.. కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి, నిరుపేద బిడ్డ గెల్లు శ్రీనివాస్ను గెలిపించాలని టీఆర్ఎస్వై నాయకులు అభ్యర్థించారు. మంత్రి హరీశ్రావు ఆదేశాల మేకు మాదాసు శీనన్న ఆధ్వర్యంలో మండలంలోని టేకుర్తి, చిన్నకోమటిపల్లి గ్రామాల్లో గురువారం ఇంటింటా ప్రచారం చేశారు. కరపత్రాలు పంచుతూ.. సర్కారు అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ఓట్లడిగారు. దళితబంధు, రైతుబంధు, రైతుబీమా లాంటి సంక్షేమ పథకా లను అమలు చేస్తున్న టీఆర్ఎస్కు అండగా నిలువాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ నేతల మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో యూత్ నాయకులు తనుగుల తిరుపతి, జవాజి అనిల్, నల్ల జీవన్రెడ్డి, బెల్లం మహేందర్, కౌశిక్, రాజేందర్, లక్ష్మణ్, వీరస్వామి, తిరుపతిరెడ్డి, రాజేందర్రెడ్డి, తిరుపతి, పృథ్వీ, రాకేశ్, గణేశ్, శివ, సాయికుమార్, రణధీర్, వినీత్ తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట రూరల్: మండలంలోని మాచనపల్లి గ్రామం లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని టీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం చేశారు. సర్పంచ్ బొజ్జం కల్పన, ఎంపీపీ దొడ్డె మమత, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు కడవెర్గు మమత గడపగడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. పథకాలను చూసి టీఆర్ఎస్ అభ్యర్థికి పట్టంగట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రా జేశ్వర్రావు, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు బొలవేన ఎర్రయ్య, వార్డు సభ్యులు, కార్యకర్తలున్నారు.
టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటం
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా నిరుపేదలను ఇంత పెద్ద ఎత్తున ఆదుకుని అకున చేర్చుకున్న నాయకులు లేరు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలవారికి మేలు చేస్తున్నడు. ఎన్నో పథకాలు అమలు చేస్తూ ఆదుకుంటున్నడు. వచ్చే ఉప ఎన్నికల్లో మేమంతా టీఆర్ఎస్కు అండగ ఉంటం. పార్టీ అభ్యర్థిని తప్పనిసరిగా గెలిపించుకుంటం.