మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్
కార్పొరేషన్, జనవరి 2: సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్ స్పష్టం చేశారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు కలిసినట్లు తెలిపారు. గతంలో సీఎం కేసీఆర్ తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకపోవడంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు తర్వాత సీఎం కేసీఆర్ ఫోన్ చేసి రమ్మన్నారని, అయితే అప్పటి పరిస్థితుల నేపథ్యంలో కలువలేకపోయినట్లు చెప్పారు. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ను కలిసి కరీంనగర్లోని తెలంగాణ ఉద్యమకారుల గురించి, వారి ప్రస్తుత పరిస్థితులను వివరించినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, కరీంనగర్లో స్మార్ట్సిటీ పనులు జరుగుతున్న తీరును వివరించినట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు టీఆర్ఎస్లోనే ఉంటానని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కుమార్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.