సంక్షోభంలోనూ సంక్షేమం
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
కొడిమ్యాలలో 26 మందికి కల్యాణలక్ష్మి, చొప్పదండిలో 32మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మల్యాల(కొడిమ్యాల), అక్టోబర్ 1: నిరుపేద ఆడబిడ్డల బతుకుల్లో కాంతులు నింపేందుకే కేసీఆర్ సర్కారు కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేసిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉద్ఘాటించారు. కరోనా సంక్షోభ సమయంలోనూ నిర్విఘ్నంగా పథకాలను అమలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. కొడిమ్యాల మండల పరిషత్లో శుక్రవారం 26మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు 26,03,016 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అలాగే చొప్పదండిలోని తన క్యాంపు కార్యాలయంలో కొడిమ్యాల మండలానికి చెందిన 32మందికి 6.38లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఆయాచోట్ల ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కొడిమ్యాలలో తహసీల్దార్ స్వర్ణలత, ఎంపీడీవో పద్మజ, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పును టగోటి కృష్ణారావు, వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, సహకారం సంఘం చైర్మన్లు మేన్నేని రాజనర్సింగరావు, రవీందర్రెడ్డి, సర్పంచులు సామంతుల ప్రభాకర్, తునికి నర్స య్య, ఎంపీటీసీ మల్లారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులి వెంకటేశ్గౌడ్, నేతలు గడ్డంచంద్ర మోహన్రెడ్డి, కోలాపురం రమేశ్, గడ్డం లక్ష్మారెడ్డి, అజయ్రెడ్డి, కొత్తూరి స్వామి, నరేశ్గౌడ్, రాజ్కుమార్, రొడ్డ శరత్, అనుమాండ్ల అజయ్, పలు వురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.