మంత్రి కేటీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్కేవీ నాయకుల పాలాభిషేకం
సిరిసిల్ల టౌన్, జనవరి 1: వస్త్ర పరిశ్రమపై అదనంగా పెంచిన జీఎస్టీ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవడంలో మంత్రి కేటీఆర్ పాత్ర కీలకమైందని టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని గణేశ్నగర్లో టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్ వస్త్ర పరిశ్రమపై విధించాలని నిర్ణయించిన ఏడు శాతం జీఎస్టీని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాసి ఒత్తిడి పెంచారన్నారు. గతంలో విధించిన జీఎస్టీని తగ్గించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయన్నారు. రాష్ట్ర ప్రభు త్వం మొదటి నుంచి వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నదని తెలిపారు. ఈ క్రమం లో మరోసారి అదనంగా ఏడు శాతం పెంచుతామని ప్రకటించడాన్ని, మంత్రి కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. వస్త్ర పరిశ్రమ అభివృద్ధే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఇక్కడ టీఆర్ఎస్కేవీ పట్టణాధ్యక్షుడు పోరండ్ల రమేశ్, కొండ సుభాష్, సిరిసిల్ల రవీందర్, చేరాల అశోక్, రాపెల్లి శ్రీహరి, రాజిరెడ్డి, కొక్కుల రవీందర్, కిషన్, డాక్టర్ రాజు, రాజమౌళి ఉన్నారు.