చొప్పదండి, జనవరి 1: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర-మణికంఠాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్-దీవెన దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. పదునెట్టాంబడిపై ప్రత్యేక పూజలు చేసిన కలశాన్ని అర్చకుడు చరణ్, ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే దంపతులకు అందజేశారు. 6వ వార్డు కౌన్సిలర్ వడ్లూరి గంగరాజు పుట్టిన రోజును పురస్కరించుకొని అయ్యప్ప భక్తులకు భిక్ష ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే పాల్గొని వడ్డన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అయ్యప్ప అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని పేర్కొన్నారు. ఆలయ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించిన ఆలయ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణహరి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, నాయకులు తాళ్లపెల్లి శ్రీనివాస్గౌడ్, నలుమాచు రామకృష్ణ, గాండ్ల లక్ష్మణ్, బీసవేని రాజశేఖర్, తిరుపతి, అయ్యప్ప స్వాములు వెంసాని రవీందర్యాదవ్, మరిమడ్ల రాజిరెడ్డి, మునిగాల సుధాకర్, సింహాచలం హరికృష్ణ, గడ్డం చుక్కారెడ్డి, కట్ట సత్యం, అలుస లక్ష్మీనారాయణ, ఎన్నం మునీందర్, దండె సత్యానందం, గుర్రం శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన నాయకులు
గంగాధర, జనవరి 1: మండలంలోని బూరుగుపల్లిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను టీఆర్ఎస్ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ ఏఎంసీ చైర్మన్ సాగి మహిపాల్రావు, సింగిల్ విండో చైర్మన్ దూలం బాలగౌడ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్గోపాల్రెడ్డి, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ పుల్కం గంగన్న, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, మేచినేని నవీన్రావు, వేముల దామోదర్, ముక్కెర మల్లేశం, మాల చంద్రయ్య, పొట్టల కనకయ్య, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, కోలపురం లక్ష్మణ్, ఉపసర్పంచ్ నిమ్మనవేణి ప్రభాకర్, నాయకులు దూలం శంకర్గౌడ్, అట్ల శేఖర్రెడ్డి, ఆకుల మధుసూదన్, రామిడి సురేందర్, వేముల అంజి, కరబూజ తిరుపతిగౌడ్, తడిగొప్పుల రజిత, వడ్లూరి ఆదిమల్లు, పంజాల ఆంజనేయులు, ఎగుర్ల మల్లయ్య, దూస అనిల్, సత్యం పాల్గొన్నారు.
రామడుగు, జనవరి 1: గంగాధర మండలం బూరుగుపల్లిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను మండలంలోని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి, కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్రెడ్డి, తిర్మలాపూర్ సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య, గుండి ఎంపీటీసీ మడ్డి శ్యాంసుందర్గౌడ్, మాజీ ఎంపీపీ మామిడి తిరుపతి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ తడగొండ అజయ్, గోపాల్రావుపేట మాజీ సర్పంచ్ నేరెళ్ల అంజయ్య, టీఆర్ఎస్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, గుర్రం రాజశేఖర్గౌడ్, పూడూరి మల్లేశం, కార్యద మల్లారెడ్డి, తడగొండ రాజు, హన్మంతు, బక్కశెట్టి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.