కమాన్చౌరస్తా, అక్టోబర్ 25: పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యమివ్వాలని, మన పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామని శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆచార్య ఎస్ మల్లేశ్ సూచించారు. యూనివర్సిటీ స్పోర్ట్స్ గ్రౌండ్లో సోమవారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో క్లీన్ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ ఎస్ మల్లేశ్ హాజరై మాట్లాడారు. వలంటీర్లు సేవా భావంతో పనిచేయాలన్నారు. ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కే శ్రీవాణి మాట్లాడుతూ, వలంటీర్లు అంకిత భావంతో క్లీన్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ సైన్స్ కళాశాల యూనిట్-1, ఆర్ట్స్ కళాశాల యూనిట్ -2, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ యూనిట్-3 వలంటీర్లు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. ఎం వరప్రసాద్, ఓఎస్డీ డా. వన్నాల రమేశ్, ప్రిన్సిపాళ్లు డా. జాఫర్ జరి, డా. సరసిజ, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
కళాశాలల్లో..
నగరంలోని శ్రీచైతన్య డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ కెడెట్లు గాంధీ విగ్రహ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. కళాశాల చైర్మన్ ఎం రమేశ్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎన్సీసీ శిక్షణతో జాతీయ భావాలు పెంపొందుతాయన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్, ఫిజిక్స్ విభాగాధిపతి ఎం సునీల్కాంత్, అధ్యాపకులు డీ సాదర్, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే, వాణీనికేతన్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో క్లీన్ ఇండియా కార్యక్రమం నిర్వహించగా, కళాశాల సెక్రటరీ దీపిక ప్రారంభించారు. ఈ సందర్భంగా వలంటీర్లు కళాశాల ఆవరణలో ఉన్న చెత్తను తొలగించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారి ప్రిన్సిపాల్ డీ వేణుగోపాల్ రెడ్డి, పీవో పెద్ది రమేశ్, అధ్యాపకులు వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.