వీణవంక, అక్టోబర్ 26: టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపుతోనే హుజూరాబాద్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఉద్ఘాటించారు. వీణవంక మండలం మామిడాలపల్లి, ఎలుబాక, ఘన్ముక్ల, మల్లన్నపల్లి, బ్రాహ్మణపల్లిలో ప్రచారం చేశారు. గొల్ల, కురుమలు, రైతుల సమావేశాల్లో పాల్గొన్నారు. అనంతరం వీణవంకలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నేతలు విమర్శలు మానుకోవాలని, ప్రజలపై ప్రేముంటే కేంద్రం నుంచి నిధులు తేవాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి చేసిందేమీ లేదని, రూపాయి పని చేయలేదని దుయ్యబట్టారు. రెండేండ్లలో నియోజకవర్గానికి ఒక్కసారి కూడా రాని వ్యక్తి ఇప్పుడెందుకు వస్తున్నాడో అర్థం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈటల రాజేందర్తో హుజూరాబాద్కు ఏం లాభం లేదని, ఇన్నేండ్ల కాలంలో ఏం చేశాడని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా రెండున్నరేండ్లు అధికారంలో ఉంటుందని, గెల్లు గెలిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని చెప్పారు. సీఎం కేసీఆర్ కులవృత్తులకు చేయూతనిస్తున్నారని, గొల్ల, కుర్మల ఉపాధి కోసం రూ.11వేల కోట్లతో గొర్రె పిల్లలను పంపిణీ చేశారని గుర్తు చేశారు. పేదింటి యాదవ బిడ్డ గెల్లు శ్రీనివాస్కు టికె ట్ ఇచ్చారని, ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని కోరారు. కార్యక్రమాల్లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు మనోహర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, రాష్ట్ర నాయకులు పాడి కౌశిక్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు కాంతారెడ్డి, సునీత, వరలక్ష్మి, ఎంపీటీసీలు నాగిడి సంజీవరెడ్డి, సంగ స్వరూప, నాయకులు గెల్లు మల్లయ్య, ముత్యాల శంకర్, చిన్నాల అయిలయ్య పాల్గొన్నారు.