హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బుధవారం ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్లు కట్ చేసి, పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. అలాగే అన్నదానం, రక్తదానం తదితర సేవా కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్సీగా పాడి అందిస్తున్న సేవలను కొనియాడారు. ఆయన మరెన్నో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని, ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.
హుజూరాబాద్ రూరల్/ ఇల్లందకుంట/వీణవంక/ జమ్మికుంట రూరల్, డిసెంబర్ 21
హుజూరాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు అభిమానులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్రెడ్డి, సీఐలు శ్రీనివాస్, సురేశ్కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ గంధె రాధికాశ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, పార్టీ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు కే రమాదేవి, మండలాధ్యక్షుడు డాక్టర్ ఐలయ్య, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అలాగే హైదరాబాద్ మలక్పేటలోని ఫిన్ బధిరుల ఆశ్రమంలో హుజూరాబాద్ బీఆర్ఎస్ యువజన విభాగం పట్టణాధ్యక్షుడు గందె సాయిచరణ్, పట్టణ కార్యదర్శి ఎండీ రియాజ్, సోషల్ మీడియా పట్టణ ఇన్చార్జి గాలి రాకేశ్, బీఆర్ఎస్ యూత్ నాయకుడు భూసారపు రాజీవ్ ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక క్రీడా మైదానంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కౌశిక్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మకపల్లి రమేశ్యాదవ్, ప్రధాన కార్యదర్శి అంపటి సతీశ్, వేల్పుల రత్నం, తాళ్లపల్లి శ్రీనివాస్, సమ్మయ్య, మోరె మధు, బిట్ల వెంకటేశ్, రాజలింగు, మల్లన్న, రవి, వేల్పుల ప్రభాకర్, బోగం రమేశ్ తదితరులు ఉన్నారు.
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో కౌన్సిలర్లు, నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌక్ వద్ద మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చారు. భారీ కేక్ కట్ చేశారు. స్థానికులకు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే కొత్తపల్లి స్పందన అనాథాశ్రమంలో వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న-కోటి, ఆర్యవైశ్య యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు యాద సతీశ్, పట్టణాధ్యక్షుడు అయిత మహేశ్ అన్నదానం చేశారు. అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. విద్యార్థులకు కేక్లు, పండ్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, వార్డు కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కేక్లు కట్ చేసి, స్వీట్లు పంచారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇల్లందకుంట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. స్వీట్లు పంచారు. ఇక్కడ పీఏసీఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి, ఎంపీటీసీలు ఎక్కటి సంజీవరెడ్డి, అయిలయ్య, ఓదెలు, చిన్నరాయుడు, సర్పంచులు కలాల రాజిరెడ్డి, మట్ట రజితావాసుదేవారెడ్డి, తిప్పారపు మొగిళి, కంది దిలీప్రెడ్డి, రఫీఖాన్, మానస, బీఆర్ఎస్ ఇల్లందకుంట గ్రామాధ్యక్షుడు కందాల విక్రమ్, నాయకులు వెంకటేశ్, కుమార్, రాకేశ్, వాసు, తిరుపతిరెడ్డి, రాంస్వరణ్రెడ్డి, రావుల ఎల్లయ్య, రాజాబాబు, వేణు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
వీణవంక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి జన్మదినం సందర్భంగా పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటారు. కేక్కట్ చేసి వేడుకలు జరుపుకొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, సింగిల్విండో చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా, మండల అధ్యక్షులు నాగిడి సంజీవరెడ్డి, కాసం వీరారెడ్డి, సర్పంచులు నీల కుమారస్వామి, పోతుల నర్సయ్య, రమేశ్, ముత్తయ్య, కాంతారెడ్డి, మోరె సారయ్య, నాయకులు నీల పున్నం, మధునయ్య, సత్యనారాయణ, కృష్ణచైతన్య, గెల్లు శ్రీనివాస్యాదవ్, చింతల సుమన్ తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట మండలంలోని మాచనపల్లి, గండ్రపల్లితో పాటు పలు గ్రామాల్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు బొజ్జం కల్పనాతిరుపతిరెడ్డి, బల్మూరి పద్మాసమ్మారావు, ఎంపీటీసీలు పొల్సాని రాజేశ్వర్రావు, తోట కవితాలక్ష్మణ్, ఉప సర్పంచులు రావుల స్వరూపానర్సింగం, శ్రీకాంత్, మాజీ సర్పంచ్ పర్లపల్లి రమేశ్, మాజీ ఎంపీటీసీ భిక్షపతి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బత్తుల పాండు, బల్మూరి రాజేశ్వర్రావు, నాగరాజు, ఒరుగంటి హేమచందర్రావు, ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, మాధారపు తిరుపతిరావు, గాదె సంపత్, సతీశ్, శ్రీను, విజయ్, చందు, గోపాల్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. మండలంలోని బిజిగిరిషరీఫ్ దర్గాలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సర్పంచ్ రాచపల్లి సదయ్య, ఎంపీటీసీ రాచపల్లి రాజయ్య, మాజీ సర్పంచ్ యుగేందర్రెడ్డి, మండల మాజీ కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ సమీర్.. హజ్రత్ సయ్యద్ కుషావలికి చాదర్లను సమర్పించారు. అనంతరం కేక్కట్ చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఉన్నారు.