రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ‘భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెం దవద్దు. మేమున్నాం’ అని మున్సిపల్, పరిశ్రమలశాఖల మంత్రి జిల్లా ప్రజలకు భరోసా కల్పించా రు. అన్నివిధాలుగా సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పారు. మంగళవారం ప్రగతి భవన్ నుంచి టెలీకాన్ఫరెన్స్ ద్వా రా సిరిసిల్ల పరిస్థితిపై కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్హెగ్డే, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యతో సమీక్షించిన అమాత్యుడు, ఓ వైపు ప్రజలకు తానున్నాన నే దీమాను ఇస్తూ నే, యంత్రాంగాన్ని రంగంలోకి దింపారు. జలసంద్రమైన సిరిసిల్ల పట్టణంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ యంత్రాంగాన్ని ఆదేశించారు. వరద నీరు మళ్లించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేట, ప్రగతినగర్, సుందరయ్యనగర్, అశోక్నగర్, శాంతినగర్, పాతబస్టాండ్తో వేములవాడ నియోజకవర్గంలోని వరద ప్రాంతాల పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల కోసం హైదరాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నట్లు తెలిపారు. మరో 48 గంటలు వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున వరదనీటి మళ్లింపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.