వాడవాడలా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు
పలుచోట్ల అన్నదానాలు
దవాఖానల్లో పండ్ల పంపిణీ
హాజరైన ఎమ్మెల్యే రసమయి,టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్
మానకొండూర్, ఫిబ్రవరి 15: టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మంగళవారం పార్టీ శ్రేణులు అంబరాన్నంటేలా జరుపుకున్నాయి. పలుచోట్ల అన్నదానం చేశారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ మానకొండూర్ మండ లాధ్యక్షుడు తాళ్లపెల్లి శేఖర్గౌడ్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో నిర్వహించిన కార్యక్ర మానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హాజరయ్యారు. భవిత దివ్యాంగుల పాఠశాలలో చిన్నారులకు పండ్లు పంపిణీచేశారు. పాఠశాలకు ఫ్యా న్లు, ట్యూబ్లైట్లను వితరణ చేశారు. జడ్పీటీసీ తా ళ్లపెల్లి శేఖర్గౌడ్, నేతలు ముద్దసాని శ్రీనివాస్రెడ్డి, రొడ్డ పృథ్వీరాజ్, రామంచ గోపాల్రెడ్డి, పిట్టల మధు, ఆడప శ్రీనివాస్, గుర్రం కిరణ్గౌడ్, పారునంది కిషన్, దండు మనోజ్, కోండ్ర నిర్మల, ఎరుకల శ్రీనివాస్గౌడ్, పిండి సందీప్ ఉన్నారు.
చిగురుమామిడి, ఫిబ్రవరి 15: చిగురుమామిడి ఆరోగ్యకేంద్రంలో ఎంపీపీ కొత్త వినీతా శ్రీనివాస్రెడ్డి పార్టీ నేతలు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ బే తి రాజిరెడ్డి, ఆర్బీఎస్ జిల్లా స భ్యుడు సాంబారి కొమురయ్య, రామోజు కృష్ణమాచారి, ఎంపీటీసీలు మిట్టపెల్లి మల్లేశం, తిరుప తి, సత్యనారాయణ, అరుణ్కుమార్, మనోజ్, కిషన్రెడ్డి, ము కెర పద్మ, రమేశ్, టీ శ్రీనివాస్, జనార్దన్రెడ్డి, తిరుపతిరెడ్డి, సంపత్రెడ్డి రాజయ్య, కొమురయ్య, కృష్ణారెడ్డి, రాజకొమురయ్య, ర వీందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.
గన్నేరువరం,ఫిబ్రవరి15: గన్నేరువరంలో టీఆర్ఎస్ నాయకులు అన్నదానం చేశారు. సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు ఆయురార్థలతో జీవించా లని ఆకాంక్షించారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న వైస్ ఎంపీపీ స్వప్నా సుధాకర్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తీగల మోహన్రెడ్డి, సర్పంచులు పుల్లెల లక్ష్మీ లక్ష్మణ్, కుమ్మరి సంపత్, అటికం శారదా శ్రీనివాస్, ముస్కు కరుణాకర్రెడ్డి, నక్కమల్ల య్య, బోయిని అంజయ్య, మీ సాల ప్రభాకర్, నక్క దామోదర్, టేకు అనిల్, తేల్ల భాస్కర్, పుల్లెల సాయికృష్ణ, హన్మండ్ల శ్రీనివాస్, ప్రదీప్ ఉన్నారు.
శంకరపట్నం, ఫిబ్రవరి 15: టీఆర్ఎస్ మండలశాఖ ఆధ్వర్యంలో శంకరపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, కేజీబీవీ విద్యార్థులకు పం డ్లు పంపిణీ చేశారు. జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి, హుజూరాబాద్ మా ర్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, మండల కో ఆప్షన్ సభ్యుడు ఖాజాపాషా, ఉప సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు హన్మంతు, టీఆర్ఎస్ వై అధ్యక్షుడు అలీమొద్దీన్ ఉన్నారు.
కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే రసమయి..
తిమ్మాపూర్ రూరల్, ఫిబ్రవరి15:మండలంలోని రామహనుమాన్నగర్ సర్పంచ్ యాదగిరి వెం కటేశ్వర్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమ్మె ల్యే రసమయి కేకు కోసి నేతలకు తిని పించారు. గ్రామాన్ని దళిత బంధు కింద పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం ఆనందంగా ఉన్నదన్నారు.
ఎల్ఎండీ కాలనీలో గలమానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థులకు టీఆర్ఎస్ నేతలు పండ్లు పంపిణీ చేశారు. ఏఎంసీ చైర్మెన్ ఎలుక అనిత, ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, సర్పంచ్ జక్కని శ్రీవాణి, నేతలు నరేందర్రెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, పొన్నం అనిల్, పారునంది జలపతి పాల్గొన్నారు.